అమెరికా అధ్యక్ష ఎన్నికలు: విజయంపై డొనాల్డ్ ట్రంప్, జో బిడెన్ ధీమా..
అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. అయితే గతంలో ఏ ప్రెసిడెంట్ ఎన్నికలకు జరగని ట్రెండ్ నెలకొంది. డొనాల్డ్ ట్రంప్, జో బిడెన్ మధ్య నిర్ణయాత్మక పోటీ నెలకొంది. పోలింగ్ సరళి మరింత ఉత్కంఠ రేపుతోంది. దాదాపు అన్నీ సర్వేలు బిడెన్కు అనుకూలంగా చెప్పగా.. గతానుభవాలను బట్టి ట్రంప్ గద్దెనెక్కుతారనే అంచనాలు ఉన్నాయి.
కరోనా వైరస్ నేపథ్యంలో గతంలో కన్నా ఎక్కువగానే ముందస్తుగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. దాదాపు 100 మిలియన్ ప్రజలు తమ ఓటును యూజ్ చేసుకున్నారు. ఈ సారి 239 మిలియన్ల మంది వయోజనులు ఉన్నారు. అయితే పోస్టల్ బ్యాలెట్, మెయిల్ ద్వారా ఎక్కువ ఓట్లు రావడంతో పోలింగ్ ముగిసిన వెంటనే ఫలితం వెలువడే అవకాశం లేదు. కాస్త ఆలస్యమయ్యే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి.
విజయంపై కమలా హ్యారిస్ ధీమాతో ఉన్నారు. ప్రజలు తమకే పట్టం కడుతారని చెప్పారు. 2008, 2012లో ప్రజలు బరాక్ ఒబామాకు పట్టం కట్టారని గుర్తుచేశారు. ఈ సారి తమకు అధికారం అప్పగిస్తారని ధీమాతో చెప్పారు. ఇదీ నిజం అవుతోంది అని ఆమె ట్వీట్ చేశారు. ఎన్నికల వేళ సోమవారం ట్రంప్ నార్త్ కరోలినా, పెన్సిల్వేనియా, మిచిగాన్, విస్కొన్సిన్లో ప్రచారం చేశారు. బిడెన్ మాత్రం పెన్సిల్వేనియా, ఫ్లోరిడా, ఒహియోలో ప్రచారం చేశారు. అయితే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయంపై ట్రంప్, బిడెన్ ఇద్దరూ ధీమాతో ఉన్నారు.