ఎంహెచ్ 370 ఇక మిష్టరీయే! టెర్రరిస్ట్ అటాక్గా భావించి...
కౌలాలంపూర్: ఈ ఏడాది మార్చి 8వ తేదీన గల్లంతైన ఎంహెచ్ 370 విమానం ఆచూకీ ఇప్పటికీ అంతుపట్టడంలేదు! ప్రయాణికులతో మలేసియా విమానం అదృశ్యం కావడం ప్రపంచ చరిత్రలోనే అంతుబట్టని వ్యవహారంగా ఉంది. అందుకు కారణం ఏమిటో, అసలు అది ఎక్కడ కూలిపోయిందో ఎక్కడ గాలించినా ఇంత వరకూ వెల్లడికాలేదు.
అమెరికా సహా ప్రపంచ దేశాలు సముద్ర లోతుల్లోకి అంచులకు కూడా వెళ్లి శోధించాయి. నెలలు గడిచాయే తప్ప మలేసియా విమానం జాడ మాత్రం తెలియలేదు. సుముద్రంలో కూలియపోయిందా లేక పర్వతాలను ఢీకొని తుత్తునీయమైందా తెలియరాలేదు.
ఎంహెచ్ 370
అయినప్పటికీ ఇంకా గాలింపు మాత్రం జరుగుతోంది. ఎప్పటికప్పుడు ఆశలు అడుగంటుతున్నాయే తప్ప కూలిన ఆనవాళ్లు అంతుబట్టడం లేదు.
ఎంహెచ్ 370
ఈ విమానం అదృశ్యానికి వివిధ రకాల ఊహాగానాలు మాత్రం వినిపిస్తున్నాయి. తీవ్రవాద విమానంగా భావించి ఎవరైనా కూల్చి వేసి ఉంటారా అనే చర్చ కూడా సాగుతోంది.
ఎంహెచ్ 370
డిఫన్క్ట్ ప్రొట్యూస్ ఎయిర్ లైన్స్ మాజీ సీఈవో ఓ అనుమానం వ్యక్తం చేశారు. ఉగ్రవాదులు టెర్రర్ అటాక్గా అనుమానించి యూఎస్ మిలిటరీ అధికారులు ఎంహెచ్ 370ని కూల్చి వేసి ఉండవచ్చునని చెప్పారు.
ఎంహెచ్ 370
ఇదిలా ఉండగా, ఓ సీనియర్ బోయింగ్ 777 కెప్టెన్ మాట్లాడుతూ.. ఎంహెచ్ 370 విమానం సరిగా ఎక్కడ పడిందో తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు.
ఎంహెచ్ 370
దక్షిణ హిందూమహాసముద్రంలో ఎక్కడ పడిపోయిందో కనుక్కునే ప్రయత్నం చేస్తున్నట్లు సదరు సీనియర్ బోయింగ్ 777 కెప్టెన్ చెప్పారు.