అమెరికాలో పెరిగిన ముందస్తు పోలింగ్.. గతం కంటే రెట్టింపు.. కారణమిదేనా..?
అమెరికా అధ్యక్ష ఎన్నికలు మరికొద్ది గంటల్లో జరగబోతున్నాయి. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశారు. అయితే ఈ సారి ముందస్తు పోలింగ్ పెరిగింది. 2016తో పోలిస్తే రెట్టింపు సంఖ్యలో ప్రీ పోలింగ్ జరిగింది. 90 మిలియన్ల మంది ఓటు హక్కును వినియోగించుకున్నట్టు తెలుస్తోంది. ఇదీ 2016 ఎన్నికల పోలింగ్తో పోలిస్తే 70 శాతం అవడం విశేషం. అయితే ఈ సారి డొనాల్డ్ ట్రంప్, జో బిడెన్ వద్ద గట్టి పోటీ ఉంది.
US elections 2020: అమెరికా అధ్యక్ష పోరులో నువ్వా నేనా .. తేల్చుకోనున్న ట్రంప్ , జో బైడెన్
కరోనా వైరస్ నేపథ్యంలోనే అమెరికాలో ముందస్తు ఓటింగ్ భారీగా పెరిగింది. చాలా మంది మెయిల్, ముందస్తు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటింగ్ వేశారు. అయితే ముందస్తు ఓటింగ్ వేసేందుకు మరింత సమయం ఉంది. ఇదీ 100 మిలియన్ మార్క్ కూడా చేరొచ్చని అంచనా నెలకొంది. అయితే అమెరికాలో గల అన్నీ రాష్ట్రాల్లో ముందస్తు పోలింగ్ జరిగింది. కొన్ని చోట్ల సెప్టెంబర్ నుంచి పోలింగ్ మొదలైంది. కొన్ని చోట్ల అక్టోబర్ 15 వరకు కూడా ప్రారంభం కాలేదు.
మిచిగాన్ రాష్ట్రంలో సెప్టెంబర్ 24 నుంచి ముందస్తు పోలింగ్ ప్రారంభమైంది. అధ్యక్ష ఎన్నికలకు మూడువారాల ముందు పోలింగ్ జరగగా.. దాదాపు వివిధ వర్గాలకు చెందిన 50 శాతం ప్రజల వరకు ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాబామా తప్ప మిగతా రాష్ట్రాల్లో ముందస్తు ఓటింగ్ జరుగుతోంది.