భారత్కు ఊరట: రష్యా నుంచి ఆయుధాల కొనుగోలుపై ఆంక్షలు ఎత్తివేసిన అమెరికా
రష్యా నుంచి ఆయుధాలు కొనుగోలుపై ఆయా దేశాలపై అమెరికా విధించిన ఆంక్షలను సడలిస్తూ తీసుకొచ్చిన నేషనల్ డిఫెన్స్ ఆథరైజేషన్ యాక్ట్ 2019 బిల్లుకు అమెరికా కాంగ్రెస్ ఆమోదం తెలిపింది. దీంతో భారత్లాంటి దేశాలకు ఊరట లభించింది. ఇక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంతకం కోసం బిల్లును వైట్హౌజ్కు పంపించారు. ట్రంప్ ఆమోదం తెలిపితే బిల్లు చట్టంలా మారుతుంది.
ప్రస్తుతం బిల్లులో పొందుపర్చిన అంశాలతో పాటు కొత్త బిల్లులో కొన్ని మార్పులు చేర్పులు చేశారు. ప్రతిపాదించిక కొత్త బిల్లులో అమెరికా మిత్రదేశాలతో సంబంధాలు కొనసాగించాలా లేదా అనేది అధ్యక్షుడి నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని ఉంది. అంతేకాదు ఆ దేశ మిలటరీ నిర్వహణ, సున్నితమైన సాంకేతిక అంశాలు కూడా అధ్యక్షడే ధృవపరచాల్సి ఉంటుందని బిల్లులో మార్పులు చేశారు.
ఇదిలా ఉంటే బిల్లులో వినియోగించిన పదజాలం కాస్త క్లిష్టతరంగా ఉంది. రష్యా నుంచి ఆయుధాలు కొనుగోలు చేస్తున్న దేశాలపై ద్వితీయ ఆంక్షలు కాంగ్రెస్ విధించినట్లుగా అనిపిస్తోంది. వాస్తవానికి అక్కడ వినియోగించిన భాష చూస్తే ఇందులో చాలా లిటిగేషన్స్ ఉన్నట్లు కనిపిస్తోంది. ఆ లూప్ హోల్స్ భారత్కు కలిసొచ్చేలా ఉన్నాయి.
బిల్లులో
పొందుపర్చిన
అంశాలను
వాటి
భాషను
చూస్తే
కొన్ని
లొసుగులు
భారత్కు
కలిసొచ్చేలా
కనిపిస్తున్నాయి.
ఒక
దేశం
అమెరికా
ప్రభుత్వానికి
సహకరిస్తూ
ఆ
దేశ
వ్యూహాత్మ
జాతీయ
భద్రతపై
అమెరికా
దేశం
వ్యూహాత్మక
జాతీయ
భద్రతపై
ఒక
మిత్ర
దేశం
సహకరించేలా
కొత్త
బిల్లును
పొందుపర్చింది.
ఆ
అంశాన్ని
అధ్యక్షుడు
ధృవీకరించాల్సి
ఉంటుంది.
అంతేకాదు
ఇదివరకున్న
CAATSA
కాట్సా
చట్టాన్ని
కూడా
NDDA-2019లో
సవరించారు.
కాట్సా
చట్టం
2017లో
చేస్తే
2018లో
అమల్లోకి
వచ్చింది.
కాట్సా చట్టం ప్రకారం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకోవడాన్ని ఖండిస్తూ ఇతర అమెరికా మిత్రదేశాలు రష్యాకు సహకరించకూడదని... ఆదేశంతో ఎలాంటి లావాదేవీలు జరపరాదని పేర్కొంటూ ఆంక్షలు విధించింది. ఇది భారత్కు కాస్త అడ్డంకిగా నిలిచింది. కాట్సా చట్టం అమలులోకి రాకముందే రష్యా దగ్గర నుంచి భారత్ ఐదు S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టంను కొనుగోలు చేయాలని ఒప్పందం కుదుర్చుకుంది. కానీ తాజాగా చట్టాన్ని సవరించడంతో భారత్కు ఊరట లభించినట్లయ్యింది.