భారత్, పాక్, మధ్య.. అణుయుద్ధం జరుగుతుందా? పశ్చిమ దేశాల్లో టెన్షన్!?
ఇండియా, పాకిస్తాన్, చైనా నడు అణుయుద్ధం వచ్చే అవకాశాలున్నాయా? ఈ మూడు దేశాల మధ్య నెలకొని ఉన్న ఉద్రిక్త పరిస్థితులపై పశ్చిమ దేశాల్లో కాస్త ఆందోళన వ్యక్తమవుతోంది.
వాషింగ్టన్: ఇండియా, పాకిస్తాన్, చైనా నడు అణుయుద్ధం వచ్చే అవకాశాలున్నాయా? ఈ మూడు దేశాల మధ్య నెలకొని ఉన్న ఉద్రిక్త పరిస్థితులపై పశ్చిమ దేశాల్లో కాస్త ఆందోళన వ్యక్తమవుతోంది.
త్వరలోనే దక్షిణ ఆసియా దేశాల్లో ఆకాశం ఊడిపడే ప్రమాదం ఉందని పశ్చిమ దేశాలు భావిస్తున్నాయి. కానీ వాషింగ్టన్కు చెందిన అట్లాంటిక్ కౌన్సిల్ సంస్థ మాత్రం దీనికి సంబంధించి ఓ క్లారిటీ ఇచ్చింది.
ఇండియా, పాకిస్తాన్ మధ్య అణుయుద్ధం జరిగే ఛాన్సే లేదని ఆ సంస్థ తేల్చేసింది. అట్లాంటిక్ కౌన్సిల్లోని దక్షిణాసియా నిపుణులు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఇటీవల ఢిల్లీ, ఇస్లామబాద్, బీజింగ్లో జరిగిన సెమినార్ల ఆధారంగా కౌన్సిల్ ఈ నిర్ణయానికి వచ్చింది.
భారత్, పాక్, చైనా మధ్య తీవ్ర శత్రుత్వం ఉన్నా.. ఆ దేశాల మధ్య వాణిజ్యం బాగానే ఉందని అట్లాంటిక్ కౌన్సిల్ తెలిపింది. భారత ఉప ఖండంలో అణు యుద్ధం రావచ్చు అని వస్తున్న వాదనలకు ఆధారాలు లేవని ఆ సంస్థ వెల్లడించింది.
అయితే చైనా, భారత్లో జాతీయవాదం దూకుడుగా ఉందని, చైనా, పాకిస్తాన్, ఇండియా.. ఈ మూడు దేశాల్లోనూ అణ్వాయుధ నిర్ణయం మిలిటరీ చేతుల్లో లేదని, ప్రభుత్వమే నిర్ణయాలు తీసుకోవాలి కాబట్టి, అణుయుద్ధం వస్తుందేమో అనే భయం అవసరం లేదని పేర్కొంది.
భారత్, పాక్ దగ్గర అణ్వాయుధాలు ఉన్నప్పటికీ.. ఆ దేశాలేమీ అణు పరీక్షలు నిర్వహించడం లేదని అట్లాంటిక్ కౌన్సిల్ అభిప్రాయపడింది. చైనా కూడా తన వార్హెడ్స్ను ఉపయోగించడం లేదని పేర్కొంది.