నేను మోసగాడ్ని కాదు, అంతా అబద్దం: విజయ్ మాల్యా, లండన్ కోర్టులో ఊరట
లండన్: భారత్లోని బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి లండన్లో తలదాచుకుంటున్న విజయ్ మాల్యాకు బ్రిటన్ కోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. అనంతరం విచారణను సెప్టెంబర్ 12వ తేదీకి వాయిదా వేసింది. విచారణ నిమిత్తం ఆయన వెస్ట్ మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టుకు హాజరయ్యారు. అతను తన కొడుకు సిద్ధార్థతో పాటు వచ్చాడు.
బ్యాంకులతో సెటిల్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని విజయ్ మాల్యా చెప్పారు. తనపై మనీ లాండరింగ్ ఆరోపణలు అవాస్తవమని చెప్పారు. ఆయన మంగళవారం లండన్లోని వెస్ట్ మినిస్టర్ కోర్టుకు హాజరయ్యారు. తనను మోసగాడు అనవద్దన్నాడు. విచారణకు హాజయ్యేందుకు వచ్చిన ఆయన కోర్టు బయట మీడియాతో మాట్లాడారు.
అన్ని విధాలుగా సెటిల్ చేసుకోవడానికి అంగీకారం చెబుతూ కర్ణాటక కోర్టుకు తెలిపానని మాల్యా చెప్పాడు. రూ.14వేల కోట్ల రూపాయల ఆస్తులను కోర్టు ముందు ఉంచానని చెప్పారు. వాటిని అమ్మవచ్చునని కూడా చెప్పానని తెలిపాడు. వాటిని అమ్మి చెల్లించడం ద్వారా బ్యాంకులు అన్నీ సంతోషిస్తాయన్నాడు. కానీ తాను మనీ లాండరింగ్కు పాల్పడ్డాననే ఆరోపణలు సరికాదన్నాడు.