కరోనా వ్యాక్సిన్ విషాదం: ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ వేసిన వాలంటీర్ మృతి
సావోపాలో/ఫ్రన్ఫర్ట్: కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రపంచ వ్యాక్తంగా అనేక వ్యాక్సిన్ ప్రయోగాలు జరుగుతున్నాయి. అయితే, కొన్ని ప్రయోగ దశలు విజయవంతమైనప్పటికీ.. చివరి దశలో ఆ వ్యాక్సిన్ ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. దీంతో మరోసారి మొదట్నుంచి ప్రయోగాలను ప్రారంభిస్తున్నారు శాస్త్రవేత్తలు.
తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు: 20వేలకు తగ్గిన యాక్టివ్ కేసులు
తాజాగా, ఓ కరోనా వ్యాక్సిన్ ప్రయోగ పరీక్షల్లో విషాదం చోట చేసుకుంది. ఆస్ట్రాజెనికా తయారు చేసిన వ్యాక్సిన్ను వేయించుకున్న ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయినట్లు బ్రెజిల్ ఆరోగ్య విభాగం బుధవారం వెల్లడించింది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీతో కలిసి ఆస్ట్రాజెనికా ఈ వ్యాక్సిన్ను అభివృద్ధి చేసింది.
కాగా, పలు దేశాల్లో దీనిపై ప్రయోగాలు జరుగుతున్నాయి. మొదటి, రెండో దశ పరీక్షల సందర్భంగా ఇటీవల బ్రిటన్లో కూడా ఒక వాలంటీర్ అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఈ వ్యాక్సిన్ మూడో దశ పరీక్షలు తాత్కాలికంగా వాయిదా వేశారు. ఆ తర్వాత ఇప్పుడు బ్రెజిల్, బ్రిటన్లలో పరీక్షలను పునర్ ప్రారంభించారు.
మూడోదశ క్లినికల్ పరీక్షల్లో ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ను వేయించుకున్న ఓ వ్యక్తి మృతి చెందాడని, ఇందుకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ రిపోర్టు తమకు అందిందని బ్రెజిల్ ఆరోగ్య శాఖ వెల్లడించింది.
సదరు వ్యక్తి టీకా కారణంగానే మరణించారా? లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా? అనేదానిపై అధికారులు స్పష్టత ఇవ్వలేదని తెలిపింది. ఈ క్రమంలో వ్యాక్సిన్ తదుపరి పరీక్షలు కొనసాగుతాయని వెల్లడించింది.
మరోవైపు, వాలంటీర్ మృతి వివరాలను సమీక్షించామని, తమ వ్యాక్సిన్ భద్రతపై అనుమానాలు అవసరం లేదని ఆక్స్ఫర్డ్ ప్రతినిధి బక్స్టన్ తెలిపారు. వ్యాక్సిన్తో వాలంటీర్ మృతి చెందాడనే వార్తలతో ఆస్ట్రాజెనికా 18 శాతం క్షీణించాయి.