వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏకే47 పేల్చిన చిన్నారి: భారత్, మోడీకి వార్నింగ్(వీడియో)

|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్: మనదేశంలోని యూరీ ప్రాంతంలో ఉగ్రదాడికి పాల్పడి 20మంది సైనికుల ప్రాణాలు తీసిన పాకిస్థాన్‌పై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహ జ్వలాలు పెల్లుబుకుతున్నాయి. కాగా, పాకిస్థాన్ ఓ వైపు దాడులకు పాల్పడుతూనే మనదేశంపైనే మండిపడిపోతోంది. అంతేగాక, ఆ దేశంలోని ప్రజల్లో కూడా ధ్వేష భావాన్ని కలిగిస్తోంది. ఇందుకు తాజాగా, వెలువడిన ఓ వీడియోనే సాక్ష్యంగా నిలుస్తోంది.

పాకిస్థాన్‌కు చెందిన ఓ చిన్నారికి ఏకే 47 గన్ అప్పగించి.. భారతదేశానికి, ప్రధాని నరేంద్ర మోడీకి హెచ్చరికలు జారి చేసినట్లుగా ఉన్న వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు ఆ చిన్నారి తండ్రి.

Terror

ఈ వీడియోలో ఓ చిన్నారి తన తండ్రి పక్కనే కూర్చుని ఏకే 47 గన్ పట్టుకుని భారత్‌ను హెచ్చరించినట్లుగా వ్యాఖ్యలు చేసింది. అంతేగాక, వార్నింగ్ ఇస్తున్నట్లు ఏకే 47తో కాల్పులు జరిపింది. గన్ ఎలా పేల్చాలో కూడా ఆ పాపకు తండ్రే నేర్పించడం గమనార్హం. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోపై భారతీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, పాకిస్థానీయులు మాత్రం మద్దతుగా వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

కాగా, పాక్ ఉగ్రదాడిని ప్రపంచ దేశాలన్నీ ఖండించాయి. దీంతో పాకిస్థాన్ ఏకాకిగా మారిపోయింది. ఏదైనా మాట్లాడితో ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్నట్లు తెలిసిపోతుందని దాడిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదు పాకిస్థాన్. అంతేగాక, భారతే.. పాకిస్థాన్ లో ఉగ్రవాదులను ప్రోత్సహిస్తోందంటూ పిచ్చి ప్రేలాపనలు చేస్తోంది కూడా.

English summary
A video showing a Pakistani girl warning India and PM Narendra Modi and firing a shot from an AK-47 is doing the rounds on social media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X