వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాన్సాస్ ఘటనను నుంచి తేరుకోకముందే మరో హత్య

కాన్సాస్ ఘటనను మరిచిపోక ముందే అమెరికాలో మరో జాత్యంహకార హత్య చోటు చేసుకుంది. భారత సంతతికి చెందిన వ్యాపారిని కాల్చి చంపారు.

By Pratap
|
Google Oneindia TeluguNews

లాంకస్టర్: కాన్సాస్ ఘటన నుంచి తేరుకోక ముందే అమెరికాలో మరో భారత సంతతి వ్యక్తి హత్యకు గురయ్యాడు. కాన్సాస్‌లో జరిగిన కాల్పుల ఘటనలో శ్రీనివాస్ కూచిభొట్ల మరణించిన వారం రోజులు దాటింది. ఈ స్థితిలో మరో జాత్యంహకార హత్య చోటు చేసుకుంది.

అమెరికాలోని పెన్సిల్వేనియాలో గల లాంకస్టర్‌లో భారత సంతతికి చెందిన వ్యాపారిని కాల్చి చంపారు. అతని ఇంటి బయట ఈ దారుణం చోటు చేసుకుంది. పని పూర్తి చేసుకుని ఇంటికి వస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

harnish patel

మృతుడిని 43 ఏళ్ల హర్నీష్ పటేల్‌గా గుర్తించారు. పటేల్ రాత్రి 11.24 గంటలకు తన స్టోర్‌ను మూసేసి టయోటా మినీవ్యాన్‌లో ఇంటికి బయలుదేరాడని పోలీసులు చెప్పారు. అతను స్పీడీ మార్ట్ అనేదాన్ని నడుపుతున్నాడు.

అతనికి భార్య, ఓ బిడ్డ ఉన్నారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదు. పోలీసులు క్లూస్ కోసం గాలిస్తున్నారు. ఇందుకు సంబంధించిన విషయాలు ఏమైనా తెలిస్తే తమకు తెలియజేయాలని కోరారు.

English summary
In yet another incident involving possible hate crime, an Indian-origin businessman was shot dead outside his home in Lancaster County in the US state of South Carolina.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X