కారణమిదే: బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్కు అరుదైన గౌరవం
ధావోస్: బాలీవుడ్ సూపర్స్టార్ షారూఖ్ ఖాన్ కు అరుదైన గౌరవం దక్కింది. థావోస్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో భారత సినీ నటుడు షారూఖ్ ఖాన్ క్రిస్టల్ పురస్కారాన్ని అందుకొన్నాడు. ఈ సందర్భంగా షారూఖ్ చేసిన ప్రసంగం పలువురి ప్రశంసలు పొందింది.
Recommended Video
మహిళలు, చిన్నారుల హక్కుల కోసం గణనీయమైన కృషి చేసే వ్యక్తులకు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ఈ అవార్డును ఏటా అందజేస్తోంది. మీర్ ఫౌండేషన్ ద్వారా షారూఖ్ తన సేవలను అందిస్తున్నారు. యాసిడ్ దాడులకు గురైన మహిళలకు, అగ్ని ప్రమాదాల్లో గాయపడిన వారికి మెడికల్ ట్రీట్ మెంట్ అందించడం, న్యాయ సహయం అందిస్తున్నారు.వోకేషనల్ ట్రైనింగ్, పునరావాసంతో పాటు జీవనం కోసం కూడ షారూఖ్ ఖాన్ ఈ పౌండేషన్ ద్వారా సేవలను అందిస్తున్నారు.
హాలీవుడ్ తారలు కేట్ బ్లాంచెట్, లెజెండరీ సంగీత దర్శకుడు ఎల్టోన్ జాన్లతోపాటు షారూఖ్కి 24వ క్రిస్టల్ అవార్డును అందుకున్నాడు. ఇక అవార్డు పట్ల డబ్ల్యూఈఎఫ్కు షారూఖ్ఖాన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
భారత్ తరపున ఈ అంశంపై మరింతగా కృషి చేసేందుకు ప్రయత్నిస్తానని వ్యాఖ్యానించాడు. అనంతరం బ్లాంచెట్తో స్టేజీపై సెల్ఫీ దిగేందుకు యత్నించి సదస్సులో నవ్వులు పూయించాడు.
షారూఖ్ ఖాన్ నిర్వహిస్తున్న మీర్ పౌండేషన్ పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. నాలెడ్జీ షేరింగ్ కార్యక్రమాలను, ప్రజల్లో పలు విషయాలపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. క్యాన్సర్ వ్యాధి బారిన పడిన చిన్నారులకు ఉచితంగా ఈ పౌండేషన్ ద్వారా షారూఖ్ ఖాన్ చికిత్స అందిస్తున్నారు