ఈపిల్ టవర్ దగ్గర గ్యాంగ్ రేప్: ఫేస్ బుక్ ఫ్రెండ్స్
పారిస్: ప్రపంచ వింతల్లో ఒకటైన ఈపిల్ టవర్ వద్ద ఓ టీనేజ్ యువతిపై ముగ్గురు కామాంధులు గ్యాంగ్ రేప్ చేశారు. ఆమెకు మాయమాటలు చెప్పి పిలిపించి సామూహిక అత్యాచారం చేశారని పోలీసు అధికారులు అన్నారు.
అత్యాచారం చేసిన నిందితుల్లో ఒకరు ఆమెతో ఫేస్ బుక్ లో చాట్ చేశారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. సామూహిక అత్యాచారం చేసిన ముగ్గురిని పోలీసు అధికారులు అరెస్టు చేశారు.
అల్జీరియాకు చెందిన ముగ్గురు వ్యక్తులు ఫ్రాన్స్ కు చెందిన యువతితో ఫేస్ బుక్ లో పరిచయం పెంచుకున్నారు. ఆ ముగ్గురిలో ఒకరు ఆమెకు మాయమాటలు చెప్పి బాగ దగ్గరయ్యాడు. ఆమెపై సామూహిక అత్యాచారం చెయ్యాలని ముందుగానే ప్లాన్ వేసుకున్నారు.
ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం ఆమెను పారిస్ లోని ఈపిల్ టవర్ ద్గరకు రప్పించారు. తరువాత ఆమెను ఈపిల్ టవర్ దగ్గర ఉన్న చాంప్ దే మార్స్ గార్డెన్ లోకి తీసుకు వెళ్లి సామూహిక అత్యాచారం చేసి పరారైనారు.
బాధితురాలు ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. హోటల్ లో తలదాచుకున్న ముగ్గురిని అరెస్టు చేశామని పోలీసు అధికారులు తెలిపారు. కేసు విచారణలో ఉందని, భద్రత కారణంగా పూర్తి వివరాలు చెప్పలేమని పారిస్ పోలీసు అధికారులు తెలిపారు.