మతం, ఉగ్రవాదం వేరు!: రష్యా ప్రధానితో మోడీ(పిక్చర్స్)
నయ్ ప్యీ తా: విదేశీ పర్యటనలో ఉన్న భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గురువారం ఉదయం మయన్మార్ రాజధానిలో రష్యా అధ్యక్షుడు మెద్వెదేవ్తో భేటీ అయ్యారు. ఆ సమయంలో ఇరు దేశాల ప్రతినిధులు కూడా ఉన్నారు. భారత్ -రష్యా సంబంధాలు ద్వైపాక్షిక, అంతర్జాతీయ అంశాలు చర్చకు వచ్చాయి. ముందుగా తూర్పు ఆసియా సదస్సులో కూడా మోడీ పాల్గొన్నారు.
వచ్చే నెలలో ఇండో రష్యన్ సదస్సు జరగనున్న నేపథ్యంలో ఇద్దరు దేశాధినేతల మధ్య పలు ద్వైపాక్షిక అంశాల పైన చర్చలు సాగాయి.
భారత్ సన్నిహిత, విలువైన భాగస్వామి అని రష్యా ప్రధాని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రధాని ప్రస్తుత పర్యటనలో రష్యా ప్రధానితో సమావేశం మొదటి దౌత్యపరమైన సమావేశం. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు బలపడతాయని మోడీ అన్నారు.
ఆసియా దేశాల శిఖరాగ్ర సదస్సు
మయన్మార్లో జరిగిన తూర్పు ఆసియా దేశాల శిఖరాగ్ర సదస్సులో నరేంద్ర మోడీ గురువారం ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
ఆసియా దేశాల శిఖరాగ్ర సదస్సు
మతానికి, ఉగ్రవాదానికి ముడిపెట్టవద్దని నరేంద్ర మోడీ అన్నారు. రెండింటికీ మధ్య సంబంధాన్ని ప్రపంచ దేశాలు తిరస్కరించాలన్నారు.
ఆసియా దేశాల శిఖరాగ్ర సదస్సు
పలు దేశాల్లో ఉగ్రవాదం, వేర్పాటువాదం విపరీతంగా పెరిగిపోతోందని దానిని అడ్డుకోవాల్సిన అవసరం ఉందని నరేంద్ర మోడీ అన్నారు.
ఆసియా దేశాల శిఖరాగ్ర సదస్సు
ఉగ్రవాదం అరికట్టడానికి తీసుకోవాల్సిన పలు చర్యల పైన సదస్సులో చర్చించారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనడంలో అనేక సవాళ్లు ఎదురవుతున్నాయన్నారు.
ఆసియా దేశాల శిఖరాగ్ర సదస్సు
వీటికి తోడు మాదక ద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణా, మనీలాండరింగ్లకు అంతర్లీనంగా సంబంధం ఉందని నరేంద్ర మోడీ చెప్పారు.
ఆసియా దేశాల శిఖరాగ్ర సదస్సు
మయన్మార్లో జరిగిన తూర్పు ఆసియా దేశాల శిఖరాగ్ర సదస్సులో నరేంద్ర మోడీ గురువారం ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
ఆసియా దేశాల శిఖరాగ్ర సదస్సు
మతానికి, ఉగ్రవాదానికి ముడిపెట్టవద్దని నరేంద్ర మోడీ అన్నారు. రెండింటికీ మధ్య సంబంధాన్ని ప్రపంచ దేశాలు తిరస్కరించాలన్నారు.
ఆసియా దేశాల శిఖరాగ్ర సదస్సు
పలు దేశాల్లో ఉగ్రవాదం, వేర్పాటువాదం విపరీతంగా పెరిగిపోతోందని దానిని అడ్డుకోవాల్సిన అవసరం ఉందని నరేంద్ర మోడీ అన్నారు.
ఆసియా దేశాల శిఖరాగ్ర సదస్సు
ఉగ్రవాదం అరికట్టడానికి తీసుకోవాల్సిన పలు చర్యల పైన సదస్సులో చర్చించారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనడంలో అనేక సవాళ్లు ఎదురవుతున్నాయన్నారు.
ఆసియా దేశాల శిఖరాగ్ర సదస్సు
వీటికి తోడు మాదక ద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణా, మనీలాండరింగ్లకు అంతర్లీనంగా సంబంధం ఉందని నరేంద్ర మోడీ చెప్పారు.