Illegal affair: పిన్నితో మస్త్ మజా, బెడ్ రూమ్ లో అత్తచూసి షాక్, ఎవరి స్కెచ్ వాళ్లదే, జనాభా లెక్కల్లో పేరు !
చెన్నై సిటి: కామంతో కళ్లు మూసుకుపోయి ఇంట్లోని బెడ్ రూమ్ లో మస్త్ మజా చేస్తూ అక్రమ సంబంధం సాగిస్తున్న కుటుంబ సభ్యులను మందలించిన వివాహిత మహిళ పేరు జనాభా లెక్కల్లో లేకుండా పోయింది. వరుసకు చిన్నమ్మ (పిన్ని ) అయ్యే మహిళతో ఏమిటి నీ రాసలీలలు అంటూ హెచ్చరించిన అత్తను ఆమె అల్లుడు కిరాతకంగా చంపేశాడు. అత్తను కొడవలితో నరుకుతున్న సమయంలో అడ్డు వెళ్లిన మామను హత్య చెయ్యడానికి అల్లుడు బరితెగించాడు. వావివరుసల మరిచిపోయి ఎవరి స్కెచ్ లు వాళ్లవే అంటూ ఇంట్లోనే రాసలీలలు సాగించిన వారిని హెచ్చరించిన పాపానికి వివాహిత మహిళ హత్యకు గురి కావడం కలకలం రేపింది.
Girlfriend: మేడమ్ కు భర్త, సార్ కు భార్య లేరు, రాత్రి ఎంజాయ్ చేసి ఇనుపరాడ్ తో, అప్పుడు లేని భయం !
గుణసుందరి ఫ్యామిలీ హ్యాపి
చెన్నైలోని పుళల్ వినాయకపురంలోని పరిమళనగర్ లో శరవణన్, గుణసుందరి (37) దంపతులు నివాసం ఉంటున్నారు. శరవణన్, గుణసుందరి దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. శరవణన్, గుణసుందరి దంపతుల బంధువులు వారు నివాసం ఉంటున్న పరిసర ప్రాంతాల్లో చాలా మంది దగ్గరి బంధువులు నివాసం ఉంటున్నారు.
విసిగిపోయి విడాకులు ఇచ్చిన భార్య
గుణసుందరి తమ్ముడు లోకు ఆరు నెలల క్రితం మరణించాడు. సోదరుడు లోకు మరణించడంతో అతని భార్య లిఖిత గుణసుందరి ఇంటిలో ఉంటున్నది. గుణసుందరి సొంత అన్న కుమారుడు గణేశన్ (26) అదే వీధి చివరిలో నివాసం ఉంటున్నాడు. కొన్ని నెలల క్రితం గణేశన్ తీరుతో విసిగిపోయిన అతని భార్య అతనికి విడాకులు ఇచ్చి ఆమె పెట్టింటికి వెళ్లిపోయింది.
భర్త చనిపోవడంతో విరహం
భర్త లోకు చనిపోవడంతో అతని భార్య లిఖిత ఒంటరిగా ఉంటున్నది. గణేశన్ భార్య విడాకులు ఇచ్చి ఆమె పుట్టింటికి వెళ్లిపోవడంతో అతను ఒంటరిగా నివాసం ఉంటున్నాడు. గణేశన్, లోకు భార్య లిఖిత దగ్గర బంధువులు కావడంతో ప్రతిరోజు మాట్లాడుకునేవారు. వరుసకు లోకు భార్య లిఖిత గణేశన్ కు చిన్నమ్మ (పిన్ని) అవుతుంది. అయితే వావి వరుసలు మరిచిపోయిన గణేశన్, లోకు భార్య లిఖిత అక్రమ సంబంధం పెట్టుకున్నారు.
మస్త్ మజా చేశారు
2019 డిసెంబర్ నెలలో లోకు చనిపోయాడు. భర్త లోకు చనిపోయి నెల రోజులు కాకముందే అతని భార్య లిఖిత వరుసకు కొడుకు అయ్యే గణేశన్ తో అక్రమ సంబంధం పెట్టుకుంది. 2020 జనవరి నుంచి కొన్ని నెలల పాటు లిఖిత, గణేష్ ఇద్దరు పనిమీద బయటకు వెలుతున్నామని గుణసుందరి, ఆమె భర్త శరవణను నమ్మించి బయటకు వెళ్లి జల్సాలు చేస్తున్నారు. ఎవ్వరికీ ఏ అనుమానం రాకుండా ఐదు నెలల నుంచి గణేషన్, లిఖిత పిచ్చపాటిగా ఎంజాయ్ చేశారు. అయితే గత మే నెలలో లాక్ డౌన్ అమలులోకి రావడంతో వీరు బయట ఎక్కువగా తిరగడానికి అవకాశం లేకుండా పోయింది.
బెడ్ రూమ్ లో అత్త చూసి షాక్
2020 మే నెల 15వ తేదీ గుణసుందరి, ఆమె భర్త శరవణన్, పిల్లలు పక్క వీధిలో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లారు. ఇంట్లో ఎవ్వరు లేరని, మనం ఏం చేసినా అడ్డు ఉండదని భావించిన గణేశన్, లోకు భార్య లిఖిత బెడ్ రూంలో రాసలీలలు మొదలుపెట్టారు. భర్త శరవణన్, పిల్లలు బంధువుల ఇంట్లో ఉన్న సమయంలోనే ఏదో వస్తువు తీసుకెళ్లడానికి గుణసుందరి ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో బెడ్ రూంలో గణేశన్, లోకు భార్య లిఖిత నగ్నంగా ఎంజాయ్ చేస్తున్న విషయం గుర్తించి షాక్ కు గురైయ్యింది. ఇంట్లోకి ఎవరు వస్తున్నారో అనే విషయం కూడా తెలీకుండా మైమరిచిపోయి ఎంజాయ్ చేస్తున్న గణేశన్, లోకు భార్య లిఖితను చూసిన గుణసుందరి మండిపడింది.
అత్త వార్నింగ్ ఇస్తే అల్లుడు ఏం చేశాడంటే ?
గణేశన్ సొంత అన్న కొడుకు కావడం, సొంత తమ్ముడు లోకు భార్య లిఖితతో అక్రమ సంబంధం సాగిస్తున్న విషయం తెలుసుకున్న గుణసుందరి అవేశంతో రగిలిపోయింది. వావివరుసలు మరిచిపోయి మీరు చేస్తున్న పని ఏమిటి, మర్యాదగా ఇంతటితో మీ అక్రమ సంబంధం వదిలేయాలని, లేదంటే అందరికి చెప్పవలసి వస్తుందని గుణసుందరి అన్న కొడుకు గణేశన్, తమ్ముడు లోకు భార్య లిఖితను హెచ్చరించింది. అయితే వారు మాత్రం గుణసుందరి మాటలు ఏమాత్రం పట్టించుకోకుండా ఆమెకు తెలీకుండా రహస్యంగా కలుసుకోవడం మొదలుపెట్టారు.
ఇంకో చాన్స్ కోసం ప్రయత్నం... నరికేశాడు
మే నెల 16వ తేదీ మరోసారి అన్న కొడుకు గణేశన్ ఇంటిలోని బెడ్ రూంలో తమ్ముడు లోకు భార్య లిఖిత రెడ్ హ్యాడెండ్ గా గుణసుందరికి చిక్కిపోయారు. ఆ సమయంలో అందరికి విషయం చెబుతానని, మీరు మామూలుగా చెబితే మాట వినరని గుణసుందరి గట్టిగా కేకలు వేసింది. ఆ సమయంలో ఇంట్లో ఉన్న కొడవలి తీసుకున్న గణేశన్ అత్త గుణసుందరి మీద ఇష్టం వచ్చినట్లు దాడి చేశాడు.
మామ జస్ట్ మిస్.... కటకటాలు
భార్య గుణసుందరి కోసం వెళ్లిన శరవణన్ మీద అల్లుడు గణేశన్ కొడవలితో దాడి చెయ్యడానికి ప్రయత్నించడంతో అతను తప్పించుకుని పారిపోయాడు. అల్లుడు గణేశన్ దాడిలో తీవ్రగాయాలైన గుణసుందరి ఆసుపత్రిలో చికిత్స విఫలమై మరణించింది. అత్త గుణసుందరిని హత్య చేసి వేలూరు జిల్లాలోని పెరనంపట్టు సమీపంలోని కొండమల్లిలో గ్రామం (ఆంధ్రప్రదేశ్ సరిహద్దు) తలదాచుకున్న గణేశన్ ను పోలీసులు రెండు రోజుల్లోనే అరెస్టు చెయ్యడంతో జైలుపాలైనాడు. ఇంత గొడవకు కారణం అయిన లిఖిత మాత్రం ఇప్పుడు హ్యాపీగా బయట తిరుగుతోంది. అక్రమ సంబంధం కారణం సొత్త మేనత్త అల్లుడి చేతిలో హత్యకు గురికావడం 2020లో ఆంధ్రప్రదేశ్- తమిళనాడు సరిహద్దలో కలకలం రేపింది.