వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పెళ్లి బృందంపై మిసైళ్ల దాడి: 131 మంది మృతి
సనా: యెమెన్లోని ఎర్రసముద్రం తీరంలో ఆల్మోకా రేవుకు సమీపంలో ఉన్న ఆల్ వాహిజాలో ఓ పెళ్లి బృందంపై సోమవారం మిస్సైళ్ల దాడి జరిగింది. ఈ దాడిలో మృతిచెందిన వారి సంఖ్య 131కి చేరింది. దాడి జరిగి సమయంలో 40 మంది అక్కడికక్కడే మృతిచెందారు.
దాడిలో క్షతగాత్రులను ఆస్పత్రిలో చేర్పించారు. వీరిలో మంగళవారం మృతిచెందిన వారితో కలిపి మృతిచెందిన వారి సంఖ్య 131కి చేరింది. అయితే ఈ దాడికి తమకు ఎలాంటి సంబంధంలేదని సౌదీ అరేబియా సంకీర్ణ సేనల అధికారులు ప్రకటించారు.
ఇది స్థానిక మిలిటెంట్ల పని అయి ఉంటుందని అభిప్రాయపడ్డారు. కాగా, యెమెన్లో పెళ్లి బృందంపై జరిగిన దాడిని ఐక్యరాజ్యసమితి జనరల్ సెక్రటరీ బాన్ కీ మూన్ ఖండించారు.
గత మార్చి నుంచి యెమన్లో జరుగుతున్న వైమానిక దాడుల్లో మొత్తం 5వేల మంది మృతి చెందగా, అందులో 2,355 మంది పౌరులు చనిపోయారు.
Comments
English summary
The death toll from a suspected air strike on a wedding party in Yemen on Monday has risen to at least 130, the United Nations and local medics say.
Story first published: Tuesday, September 29, 2015, 17:51 [IST]