రక్త పిశాచి: 12మంది మహిళలపై రేప్, చంపి వారి రక్తం తాగాడు
జింబాబ్వే: రక్త పిశాచిలా మారిన ఓ వ్యక్తిని జింబాబ్వే పోలీసులు అరెస్ట్ చేశారు. అతడ్ని మాస్వింగోలోని కోర్టులో ప్రవేశపెట్టారు. నిందితుడు గత వారంలోనే 12 మంది మహిళలపై అత్యాచారం జరిపి అనంతరం వారిని చంపి.. వారి రక్తం తాగాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘటన జింబాబ్వేలోని మవుమాలో జరిగింది. ఈ నేరాలు చేసి వాటి నుంచి తప్పించుకోవడానికి నిందితుడు అలోస్ నదునా(26) అనేక మారు పేర్లతో తిరిగేవాడు.
ఈ విషయమై పోలీసులు అతడిని ప్రశ్నించగా 'మా ప్రార్థనాలయంలో నాకు ఈ విషయాన్ని చెప్పారు. నన్ను నేను బలవంతుడిగా మార్చుకోడానికే వారిని చంపి రక్తం తాగాను' అని నిందితుడు చెప్పాడు.
ఎలా చంపావు అని ప్రశ్నించగా.. హొవ్ అనే అమ్మాయిని బలవంతంగా తీసుకొచ్చి, ఆమె మెడను కొరికి రక్తాన్ని తాగినట్లు కోర్టులో చెప్పాడు. ఈ విధంగా 12మంది మహిళలపై రేప్ చేసి, వారిని చంపి రక్తం తాగినట్లు తెలిపాడు.
కాగా, కోర్టు ఆ మానవ మృగానికి మే 26 వరకు కస్టడీ విధించింది. ఈ ఘటనపై అక్కడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.