IPL 2020: Match 3: బెంగళూరు వర్సెస్ హైదరాబాద్, కోహ్లీ, వార్నర్ ఢీ
దుబాయ్: సెప్టెంబర్ 21న తెలుగు క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో తలపడనుంది. ఈ మ్యాచ్ అబూదాబిలో జరగనుంది. ఇది ఈ ఐపీఎల్లో మూడో మ్యాచ్.. సోమవారం రాత్రి 7.30 గంటల నుంచి ప్రత్యక్షప్రసారం కానుంది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఎప్పటిలాగే విరాట్ కోహ్లీ నేతృత్వంలో బలంగానే ఉంది. మైక్ హెసన్, సిమన్ కాటిచ్లు ఇప్పుడు ఈ జట్టుకు అదనపు బలంగా ఉన్నారు. 2011 నాటి నుంచి కెప్టెన్గా కోహ్లీ ఉన్నప్పటికీ.. ఒక్కసారి కూడా ఐపీఎల్ టోర్నీని గెలుచుకోలేకపోయింది. రోహిత్ శర్మ ఇప్పటి వరకు ముంబై జట్టుకు నాలుగుసార్లు ఐపీఎల్ ట్రోఫీని అందించాడు. ఈ నేపథ్యంలోనే ఈసారైనా ఐపీఎల్ ట్రోఫీని దక్కించుకోవాలనే కసితో ఆడే అవకాశం ఉంది.
ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కూడా అద్భుత ఆటగాడు డేవిడ్ వార్నర్ సారథ్యంలో బలంగానే కనిపిస్తోంది. కాగా, ఈ జట్టు ఎక్కువగా డేవిడ్ వార్నర్ పైనే ఆధారపడుతుంది. అయితే, అభిమానుల అంచనాలను ఎప్పుడూ వార్నర్ తక్కువ చేయడు. మిగితా ఆటగాళ్లు కూడా రాణిస్తే ఈ జట్టుకు టోర్నీలో తిరుగుండదనే చెప్పవచ్చు.
బెంగళూరు జట్టు: విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, ఆరోన్ ఫింఛ్, యుజ్వేందర్ ఛహల్, డేల్ స్టెయిన్, ఆడమ్ జంపా, క్రిస్ మోరీస్, దేవదత్ పడిక్కల్, గుర్కీరత్ సింగ్ మన్, ఇసురు ఉడాన, జోష్ ఫిలిప్పే, మొయిన్ అలీ, మొహమ్మద్ సిరాజ్, నవదీప్ సైనీ, పార్థీవ్ పటేల్, పవన్ దేశ్ పాండే, పవన్ నేగి, శహబాజ్ అహ్మద్, శివ్ దూబే, ఉమేష్ యాదవ్, వాషింగ్టన్.
హైదరాబాద్ జట్టు: డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, మనీష్ పాండే, అబ్దుల్లా సమద్, అభిషేక్ శర్మ, బసిల్ తంపి, బవనక సందీప్, బిల్లీ స్నన్లేక్, ఫబియన్ అలెన్, జానీ బైర్ స్టో, ఖలీల్ అహ్మద్, మిచెల్ మార్ష్, మొహమ్మద్ నబీ, ప్రియం గార్గ్, సందీప్ శర్మ, సంజయ్ యాదవ్.