బావిలో దూకి భార్య, ఇద్దరు పిల్లల బలవన్మరణం.. కారణమిదేనా..?
మల్యాల : ఏం జరిగిందో ఏమో తెలియదు.. కుటుంబ కలహాలమోనని అనుమానం. కానీ ముగ్గురు విగతజీవులుగా మారారు. అదీ కూడా ఓ వ్యవసాయ దూకిలో బలవన్మరణానికి పాల్పడ్డారు. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. భర్త, కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. జగిత్యాల జిల్లా మల్యాలలో తల్లీకూతుళ్లు చనిపోవడం కలకలం రేపింది.
సర్వాపూర్ గ్రామానికి చెందిన స్వప్న భర్తతో కలిసి ఉంటోంది. వీరికి అహల్య శ్రీ అనే మూడేళ్ల కూతురు, 4 నెలల బిన్ను అనే చిన్నారి ఉంది. అయితే ఇటీవల భార్య, భర్తల మధ్య కుటుంబ కలహాలు నెలకొన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. వీరి మధ్య విభేదాలకు కారణమెంటో తెలియరాలేదు. అయితే నిన్న తన పిల్లలను తీసుకొని స్వప్న వెళ్లిపోయింది. భర్త నిర్వహించే షాపు వద్దకు వెళ్తున్నానని చెప్పింది. కానీ సాయంత్రమైనా ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చింది. ఏం జరిగిందోనని ఆందోళన చెందారు. రాత్రి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి .. వారి కోసం గాలిస్తున్నారు.
కుటుంబసభ్యులు, బంధువులు.. మరోవైపు పోలీసుల గాలింపు ప్రక్రియ కొనసాగుతుంది. ఇంతలో మల్యాల శివారులోని ఓ వ్యవసాయ బావిలో స్వప్న పిల్లలు కనిపించారు. విగతజీవులుగా కనిపించడంతో భర్త, కుటుంబ సభ్యులు రోదించారు. బావి నుంచి వారి మృతదేహాలను బయటకు తీశారు. పోస్టుమార్టం చేశాక నిజనిజాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు చెప్తున్నారు. కుటుంబ కలహాల వల్లే స్వప్న ఆత్మహత్య చేసుకొని ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.