నేను చూసా..నేను విన్నా.. నేను ఉన్నా: ప్రజా విశ్వాసం నిలబెట్టుకుంటా: జగన్ తొలి సందేశం..!
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైసీపీ అధినేత జగన్ తొలి సారిగా స్పందించారు. రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు నమ్మకంతో..తన మీద విశ్వాసంతో గెలిపించారని..వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటామ ని వివరించారు. ఆరు నెలల నుండి సంవత్సరం లోగా మంచి పరిపాలతో మంచి ముఖ్యమంత్రితో పేరు తెచ్చుకుంటానని స్పష్టం చేసారు. తన తండ్రి తరహాలోనే ప్రజల మదిలో స్థానం సాధిస్తానని ధీమా వ్యక్తం చేసారు. తన ప్రమాణ స్వీకారం పార్టీ ప్లనరీ జరిగిన ప్రాంతంలోనే 30న జరుగుతుందని ప్రకటించారు.
నవ రత్నాల పాలన అందిస్తా...
ఎన్నికల్లో గెలిచిన వైసీపీ అధినేత జగన్ తొలి సందేశం ఇచ్చారు. తాను ఈ నెల 30వ తేదీన గతంలో ప్లీనరీ జరిగిన ప్రాంతంలోనే ప్రమాణ స్వీకారం చేస్తానని ప్రకటించారు. ప్రజల దీవెన..దేవుడి దయతోనే ఇంతటి ఘన విజయం సాధ్యమైందని జగన్ చెప్పుకొచ్చారు. ఇది గొప్ప విజయమని..దీనిని అందించిన ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు. ఈ ఫలితం ద్వారా ప్రజలు తన మీద బాధ్యతను పెంచిందన్నారు. ఈ ఎన్నికల్లో వచ్చిన సీట్లు అద్బుత విజయమని వివరించారు. తన మీద నమ్మకంతో ఓటు వేసిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. అయిదు కోట్ల మంది ప్రజల్లో ముఖ్యమంత్రిగా ఒక్కరికే అవకాశం వస్తుందని..అది ప్రజల దయతో తనకు దక్కిందని చెప్పుకొచ్చారు. తొలి సంతకం గురించి సమస్య కాదని.. నవ రత్నాలను అమలు చేస్తూ పాలన అందించటమే తన లక్ష్యమని వివరించారు.
ఘన విజయం
ఎన్నికల్లో గెలిచిన వైసీపీ అధినేత జగన్ తొలి సందేశం ఇచ్చారు. తాను ఈ నెల 30వ తేదీన గతంలో ప్లీనరీ జరిగిన ప్రాంతంలోనే ప్రమాణ స్వీకారం చేస్తానని ప్రకటించారు. ప్రజల దీవెన..దేవుడి దయతోనే ఇంతటి ఘన విజయం సాధ్యమైందని జగన్ చెప్ప ఈ ఎన్నికల్లో వచ్చిన సీట్లు అద్బుత విజయమని వివరించారు. తన మీద నమ్మకంతో ఓటు వేసిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. అయిదు కోట్ల మంది ప్రజల్లో ముఖ్యమంత్రిగా ఒక్కరికే అవకాశం వస్తుందని..అది ప్రజల దయతో తనకు దక్కిందని చెప్పుకొచ్చారు. తొలి సంతకం గురించి సమస్య కాదని.. నవ రత్నాలను అమలు చేస్తూ పాలన అందించటమే తన లక్ష్యమని వివరించారు.
కొచ్చారు. ఇది గొప్ప విజయమని..దీనిని అందించిన ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు. ఈ ఫలితం ద్వారా ప్రజలు తన మీద బాధ్యతను పెంచిందన్నారు.
విశ్వసనీయతకు పట్టం కట్టారు..
ఏపీ ప్రజలకు ఇంత భారీ విజయం ఇచ్చారంటే అది విశ్వసనీయతకు పట్టం కట్టటమే అన్నారు. ప్రజలు తన మీద పెట్టుకున్న విశ్వాసాన్ని నిలబెట్టుకుంటానని ప్రకటించారు. తనకు ఇచ్చిన అవకశాన్ని సద్వినియోగం చేసుకుంటానని స్పష్టం చేసారు. గవర్నెన్స్ అంటే ఎలా ఉంటుందో..మంచి గవర్నెన్స్ ఎలా ఉంటుందో తాను ఆరు నెలల నుండి సంవత్సరం లోగా నిరూపించి మంచి ముఖ్యమంత్రి అపినించుకుంటానని ధీమా వ్యక్తం చేసారు. ఏపీ ప్రజలకు నేను చూసా..నేను విన్నా..నేను ఉన్నా అంటూ జగన్ మరోసారి హామీ ఇచ్చారు.