ఆయన ఓ కాంగ్రెస్ నేత,పైగా విద్యావేత్త, అయినా అడ్డదారుల్లో డబ్బు సంపాదించాలనే యోచన...
కరీంనగర్ ; ఓ వైపు రాజకీయ అనుభవం, మరోవైపు ఉన్నత చదువులు..ఇంకేం ప్రజలతో ఉన్న సంభంధాలకు తోడు తనకున్న విద్య,ఉద్యోగపరమైన అనుభవన్ని పెట్టుబడిగా పెట్టాడు ,జల్సాలకు అలవాటు పడి, అడ్డదారిలో అధిక సంపాదనకు పాల్పడ్డాడు.. ప్రభుత్వ ఉద్యsోగాలు ఇప్పిస్తానంటూ సుమారు ఏడు కోట్ల రుపాయాలు వసూలు చేసి కటకటాల పాలయ్యాడు వెల్ది రాధక్రిష్ణ.....అనే ఓ ప్రబుద్దుడు...
వెల్ధి రాథక్రిష్ణ అలియస్ రాధ సూర్యపేట ప్రాంతానికి చెందిన వాడు, అయన పిహెచ్ డి, పూర్తి చేశారు.. అనంతరం ఉమ్మడి అంధ్రప్రదేశ్ లోని సెక్రటేరియట్ లో ఓ శాఖకు ఓఎస్డిగా పని చేశారు..దీంతో పాటు ఇడుపులపాయ, బాసర ఐఐటిలకు ఓఎస్డిగా ఉన్నాడు..దీనికు తోడు 2015 _16 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ ప్రతినిధిగా కూడా ఉన్నారు..ఈ నేపథ్యంలోనే అటు ప్రభుత్వ శాఖలో పనిచేసిన అనుభవం, రాజకీయ పలుకుబడితో కొన్నాళ్లపాటు తన హవా కొనసాగింది..దీంతో అక్రమ సంపాదనకు తెరలేపాడు రాధ
అధికారంలో జల్సాలకు అలవాడు పడిన రాధ..తానే స్వయంగా ఉద్యోగాలు కల్పించేందకు ప్రణాళికలు రచించారు..ఈ నేపథ్యంలోనే వెంకటేశ్వర కన్సల్టెన్సి అనే పేరుతో హైద్రబాద్ అంబర్ పేటలో ఓ ప్రైవేటు కంపనీని ఏర్పాటు చేశారు..ఉమ్మడి అంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో తన ఏజెంట్ల ద్వార వందలాది నిరుద్యోగుల వద్ద ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ డబ్బులు వసూలు చేశారు...ఓక్కోక్కరి వద్ద సుమారు లక్ష నుండి 20 లక్షల వరకు వసూలు చేసినట్టు పోలీసులు తెలిపారు..ఇలా సుమారు ఏడు కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు కరీంనగర్ పోలీస్ కమీషనర్ కమలహసన్ రెడ్డి తెలిపారు...
ముఠాగా ఏర్పడిన రాధ ప్రధానంగా సెక్రటేరియట్ , రైల్వే,తోపాటు ఇతర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పలువురు నిరుద్యోగుల వద్ద దగ్గర డబ్బులు తీసుకున్నారు...కోందమందికి డబ్బులు తీసుకుని నకిలీ అపాయింట్మెంట్స్... ఇస్తూ..మోసం చేసినట్టు పోలీసులు తెలిపారు....
కాగా తెలంగాణ,ఆంధ్ర జిల్లాల పోలీస్ స్టేషన్ లో రాధపై పలు పోలీసు కేసులు నమోదు అయ్యాయి..ఈనేపథ్యంలోనే కరీంనగర్ జిల్లా నగునూర్ ప్రాంతానికి చెందిన పైడిపాల వెంకటయ్య ద్వార ఆయనకు తెలిసిన యువకుల వద్ద నుండి సుమారు 20 లక్లల రుపాయలు వసూలు చేయడంతో,వెంకటయ్య కరీంనర్ సీపి కమలహాసన్ రెడ్డిని అశ్రయించారు..దీంతో రంగంలోకి దిగిన టాస్క్ ఫోర్స్ పోలీసులు రాధను అరెస్ట్ చేశారు.. ఇక రాధ గ్రూప్ లో ఇతర సభ్యులును కూడా అరెస్ట్ చేస్థామని కరీంనగర్ సీపి తెలిపారు.....