కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మంత్రి ఈటెల కూడా.. ప్రధాని తర్వాత కరోనా టీకా.. ఇవాళే

|
Google Oneindia TeluguNews

దేశంలో రెండో దశ వ్యాక్సినేషన్‎ నేటి నుంచి అమలవుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ తొలి విడత టీకా తీసుకున్నారు. ఇటు రాష్ట్రంలో వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ కూడా టీకా తీసుకున్నారు. హుజురాబాద్ ఏరియా ఆస్పత్రిలో ఆయన కరోనా టీకా వేయించుకున్నారు. తెలంగాణలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ లేదని ఈటల రాజేందర్ స్పష్టంచేశారు. అందరికి కరోనా వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందని చెప్పారు.

కరోనా వైరస్ వ్యాక్సి‌న్ గురించి ఎలాంటి భయపడల్సిన అవసరం లేదని మంత్రి ఈటల రాజేందర్ భరోసా ఇచ్చారు. వాక్సిన్ తీసుకోవడం పట్ల ప్రజలు భయాందోళనకు గురికావద్దన్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్‎లో కూడా టీకా అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య విధాన పరిషత్ కమిషనర్ రమేష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శశాంక్ పాల్గొన్నారు.

minister etela rajender took covid-19 vaccine

45 నుంచి 59 సంవత్సరాల లోపు ఉన్న దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులకు నేటి నుంచి కరోనా టీకా ఇస్తోన్న సంగతి తెలిసిందే. మహారాష్ట్ర, ఉత్తర భారతదేశంలో కరోనా వైరస్ కేసులు ఎక్కువ వస్తోన్న సంగతి తెలిసిందే. దీంతో భయాందోళన నెలకొంది. కొన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ దిశగా అడుగులు వేస్తున్నాయి. ఓ వైపు వ్యాక్సినేషన్ జరుగుతుండగా.. మరోవైపు లాక్ డౌన్ గురించి చర్చ కాస్త వింతగా అనిపిస్తోంది. కానీ వైరస్ స్ప్రెడ్ అవుతోందని నిపుణులు చెప్పడం ఆందోళన కలిగించే అంశమే.

English summary
telangana health minister etela rajender took covid-19 vaccine at huzurabad area hospital today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X