పుట్ట మధు ఇష్యూతో ప్రభుత్వానికి సంబంధం లేదు: గంగుల కమలాకర్
ఈటల రాజేందర్ ఇష్యూతో హాట్ హాట్ చర్చ జరుగుతోంది. అయితే అనుచరులపై టీఆర్ఎస్ పార్టీ ఫోకస్ చేసింది. ముఖ్యంగా పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధుపై దృష్టిసారించింది. ఈటలతో గల లావాదేవీలతో పుట్ట మధు అజ్ఞాతంలోకి వెళ్లగా.. ఏపీలో ఆచూకీ లభించిన సంగతి తెలిసిందే. అంతేకాదు పుట్టమధును జెడ్పీ చైర్మన్ పదవీ నుంచి తప్పిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో స్థానిక మంత్రి గంగుల కమలాకర్ స్పందించారు.
పుట్ట మధు ఇష్యూతో ప్రభుత్వానికి సంబంధం లేదని కమలాకర్ చెప్పారు. కానీ కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలియజేశారు. ఇవాళ ఆయన హుజురాబాద్ నియోజకవర్గంలో పర్యటించారు. పుట్ట మధు వ్యవహారంతో సర్కార్కు సంబంధం లేదని హాట్ కామెంట్స్ చేశారు. ఇటీవల జరిగిన వామనరావు దంపతుల హత్య కేసులో పుట్ట మధు హస్తానికి సంబంధించిన కూపీని పోలీసులు లాగుతున్నారు. ఈ క్రమంలో కమలాకర్ రియాక్టయ్యారు.
హుజురాబాద్లో టీఆర్ఎస్ పార్టీ చాలా బలంగా ఉంది అని చెప్పారు. ఇక్కడ ఎవరూ గెలిచిన అదీ కేసీఆర్ క్రెడిట్ అని చెప్పారు. ఈటల రాజేందర్, గంగుల కమలాకర్కు కేసీఆర్ను చూసే ఓటు వేశారని తెలిపారు. కారు గుర్తు, కేసీఆర్ భొమ్మ ఇంపార్టెంట్ అని చెప్పారు. హుజురాబాద్లో టీఆర్ఎస్ కార్యకర్తలు అధైర్య పడాల్సిన అవసరం లేదని చెప్పారు. అందరికీ అండగా తాము ఉంటామని చెప్పారు.