కరీంనగర్ జిల్లాలో రెండవ అతిపెద్ద జాతియపతాకం..ఎగురవేసిన టిఆర్ఎస్ ఏంపి వినోద్ కుమార్...
హైద్రబాద్ ; రాష్ట్రంలో రెండవ అతిపెద్ద జాతియ జెండా కరీంనగర్ జిల్లా అవిష్కరించారు..నగరంలోని మల్టిపర్పస్ స్కూల్ అవరణలో 150 ఫీట్ల జాతియా పతాకాన్ని ఎంపీ వినోద్ అవిష్కరించారు.. కాగా హైద్రాబాద్ ట్యాంక్ బండ్ వద్దగల సంజీవయ్య పార్క్ లో తెలంగాణ ప్రభుత్వం జూన్ 2 ,2016న దేశంలోనే అతిపోడవైన జాతియా జెండాను అవిష్కరించింది.కరీంనగర్ పతాకం దేశంలో మూడవ అతిపెద్ద జాతియ జెండాగా అభివర్ణిస్థున్నారు..
హైద్రబాద్ లో ఉన్న జాతియ పతాకాన్ని స్పూర్తిగా తీసుకున్న నగర మేయర్ రవీందర్ సింగ్ దీన్ని ఏర్పాటు చేయించారు..సుమారు అరవై లక్షల రుపాయలతో జాతీయా పతాకం రూపోందించారు... 32 ఫీట్ల నిలువు 42 ఫీట్ల అడ్డు కోలతలతో పతాకాన్ని పూణే సమీపంలోని రంజాన్ గావ్ లో తాయారు చేయించారు...
కాగా జాతియ పతాక అవిష్కరణలో నగర ప్రజలు ,స్కూల్ విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గోన్నారు..ఇలాంటి జాతియా పతాక అవిష్కరణలు ప్రజల్లో మరింత దేశభక్తిని పెంపోందిస్తాయని స్థానిక నాయకులు పేర్కోన్నారు..కాగా తన చిన్నతనంలో ఇండియా వెనకబడిన దేశమని,పేద దేశమని తాను చదువుకున్నప్పుడు చాల భాధ అనిపించేదని ప్రస్థుతం అలాంటి రోజులు మారాయని ఏంపి వినోద్ అన్నారు...