వెంకటేశ్వరుడి చెంత చేరింది గరుడ పక్షి కాదట.. మరేంటో తెలుసా?
కోరుట్ల : జగిత్యాల జిల్లా కోరుట్లలోని వెంకటేశ్వర స్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. వెంకటేశుడి వాహనమైన గరుడపక్షి స్వామివారి పాదాల చెంతకు చేరిందనే వార్త వైరల్ కావడంతో పెద్దసంఖ్యలో గుమిగూడారు. గంటల వ్యవధిలోనే ఈ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. దాదాపు అన్ని టీవి ఛానళ్లలో గరుడపక్షి అని బ్రేకింగులు నడిపారు. దీంతో దేవుడి మహిమని కొందరు.. కాదు కాదు అది గుడ్లగూబని మరికొందరు కామెంట్లు చేశారు. చివరకు అది గరుడపక్షి కాదనే కోణం బయటపడింది.
వైరల్ : కోరుట్ల వెంకటేశ్వర ఆలయంలో వింత.. స్వామి పాదాల చెంత గరుడ పక్షి (వీడియో)
రీసెర్చ్ స్కాలర్ ఒకరు అది గరుడపక్షి కాదని గుడ్లగూబ సంతతకి చెందిన బర్న్ అవుల్ (Barn Owl) అని తేల్చారు. జాతీయ స్థాయి మీడియాకు ఈ విషయం వెల్లడించారు. అది సాధారణంగా మధ్నాహ్నం సమయంలో డల్ గా ఉంటుందని, ఎక్కువగా కదల్లేని పరిస్థితి ఉంటుందని తెలిపారు. అందుకే ఆలయంలో అలా ఎటూ మెదలక ఉండిపోయిందని చెప్పారు. రాత్రి సమయాల్లో మాత్రమే అది యాక్టివ్ గా ఉంటుందని వివరించారు.