1200 ఎకరాల భూమి.. రూ.600 కోట్ల విలువ, వామనరావు వాట్సాప్ పోస్టులు.. పిటిషన్ వేసేలోపు మర్డర్
వామనరావు దంపతుల హత్య కేసుతో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. వామనరావు- కుంట శ్రీను మధ్య గుడి వివాదం నడుస్తోంది. క్వారీతో పుట్ట మధు వందల కోట్లు సంపాదిస్తున్నారని వామనరావు పిటిషన్లు వేశారు. దీంతో పుట్టమధు- వామనరావు మధ్య వివాదం నడుస్తోంది. అయితే మరో కొత్త విషయం కూడా వెలుగుచూసింది. వందల ఎకరాల భూమి వివాదం తెలిసింది.
నేను ఉన్నాను.. ఎక్కడికీ వెళ్లలేదు.. వామనరావు మర్టర్ కేసుపై పుట్ట మధు
1200 ఎకరాలు..
మంచిర్యాల
జిల్లాలో
భూముల
అన్యాక్రాంతం
విషయం
బయటపడింది.
నెన్నెల
మండలంలో
1200
ఎకరాల
భూమి
చేతుల
మారిందని
వామనరావు
చెబుతున్నారు.
దీని
విలువ
బహిరంగ
మార్కెట్లో
రూ.600
కోట్లు
ఉంటుంది.
ఇదే
విషయాన్ని
వామనరావు
వాట్సాప్లో
పోస్ట్
చేశారు.
అదీ
తెగ
వైరలయ్యింది.
ఇలా
బయటకు
రావడంతో..
ప్రత్యర్థులు
వామనరావును
మట్టుబెట్టేశారు.
వామనరావు
చనిపోయిన
తర్వాత
వాట్సాప్
స్కీన్
షాట్స్
కూడా
వైరల్
అవుతున్నాయి.
పిటిషన్లతో పగ
రాజకీయ,
పోలీసు,
ప్రభుత్వ
అధికారుల
తీరుపై
పలు
అంశాల్లో
వామనరావు
హైకోర్టులో
పిటిషన్
ఫైల్
చేశారు.
దీంతో
ప్రత్యర్థి
వర్గంతో
శత్రుత్వం
ఏర్పడింది.
2018
అసెంబ్లీ
ఎన్నికల
ముందు
అప్పటి
మంథని
ఎమ్మెల్యే
పుట్ట
మధు
రూ.
900
కోట్లు
ఇసుక
క్వారీలతో
అక్రమంగా
సంపాదించాడని
హైకోర్టులో
పిటిషన్
ఫైల్
చేశారు.
పుట్ట
మధు
పోటీ
చేయకుండా
ప్రయత్నించిన
తీరు
అప్పట్లో
వివాదాస్పదంగా
మారింది.
ప్రస్తుతం
శ్రీధర్బాబుకు
అనుకూలంగా
వ్యవహరించారనే
పుట్ట
మధు
వర్గీయులు
ఆరోపణలు
చేశారు.
పోలీసులపై కూడా
వన్యప్రాణి వేట కేసులో మంథని పోలీస్స్టేషన్లో ఆత్మహత్య చేసుకున్న నిందితుడి ఘటనలో సైతం పోలీసులే కొట్టి చంపారని కోర్టులో పిటిషన్ ఫైల్ చేశారు. ఇదీ కూడా వివాదాస్పదమైంది. పలు రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారుల విషయాల్లో వామనరావు తలదూర్చారని ప్రచారం ఉంది. ఆ క్రమంలోనే ప్రత్యర్థులు ఒక్కటై మట్టుబెట్టారని తెలుస్తోంది.