ఓనర్ కాదు రాక్షసీ.. పనిమనిషిపై అఘాయిత్యం.. వీడియో తీసి బెదిరింపు.. రూ.10 లక్షలు..?
ఆమె ఇంటి ఓనర్.. మహిళే కదా అని అనుకునేరు. జర జాగ్రత్త.. ఎందుకంటే ఆమెలో మరో కోణం కూడా ఉంది. ఇంటికి పనికి పిలిచి లైంగికదాడి చేసే పెను ప్రమాదం ఉంది. ఖమ్మంలో జరిగిన ఘటన ఒళ్లు గగుర్పొడుస్తోంది. ఇంటి ఓనర్.. మహిళే ఘటనలో కీ రోల్ పోషించడం వెన్నులో వణుకు పుట్టిస్తోంది. చివరికీ ఆ పనిమనిషి ధైర్యం చేయడంతో విషయం బయటపడింది.
ఖమ్మంలో దారుణం జరిగింది. టీచర్స్ కాలనీకి చెందిన మహిళ ఇంట్లో ఒకామె పని చేస్తోంది. ఈ నెల 13న ఆమె ఇంటికి కొందరు బంధువులు వచ్చారు. ఆ ఇంట్లో పని చేస్తున్న పనిమనిషిపై వారి కన్ను పడింది. ఇంటి యజమాని సాయంతో టీ లో మత్తు కలిపారు. బంధువుల్లో ఒకడు సయ్యద్ హుస్సేన్ పనిమనిషిపై అత్యాచారం చేశాడు. ఇంటి యజమాని ఆ దారుణాన్ని వీడియో తీసింది.
డబ్బులు ఇవ్వాలని పనిమనిషిని బెదిరించింది. డబ్బు ఇవ్వకపోతే వీడియోను సోషల్ మీడియాలో పెడతానని ఇంటి ఓనర్ హెచ్చరించింది. దీంతో పనిమనిషి పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు సయ్యద్ హుస్సేన్ను అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన వారు పరారీలో ఉన్నారు. ఇంటి యజమాని గతంలో కూడా ఓ వ్యాపారిని ఇలాగే ట్రాప్ చేసినట్టు తెలుస్తోంది. రూ. 10 లక్షలు డిమాండ్ చేసిందని పోలీసులు వెల్లడించారు.