పట్టణాలకు పాకిన ఐపీఎల్ బెట్టింగ్.. కొత్తగూడెంలో 10 మంది అరెస్ట్
కొత్తగూడెం : ఐపీఎల్ బెట్టింగ్ పట్టణాలకు పాకింది. యువతను ఆకర్షిస్తూ నిర్వాహకులు పెద్దఎత్తున సొమ్ము చేసుకుంటున్నారు. తాజాగా కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టైంది. పక్కా సమాచారం అందుకున్న త్రీ టౌన్ పోలీసులు బెట్టింగ్ నిర్వహిస్తున్న ఇంటిపై దాడి చేశారు. బెట్టింగ్ నిర్వహిస్తున్న 10 మందిని అరెస్ట్ చేశారు.
వినియోగదారుల ఇష్టమే ఫైనల్..! కేబుల్, డీటీహెచ్ ఆపరేటర్లకు ట్రాయ్ వార్నింగ్
కూలీ లైన్ ఏరియాకు చెందిన ముత్తయ్య శంకర్ నేతృత్వంలో ఐపీఎల్ బెట్టింగ్ జరుగుతోందని పోలీసులు గుర్తించారు. అతనితో పాటు జనగామ సత్యనారాయణ, రాగి రాజు, శ్రీరాముల శివకిరణ్, పాటిబండ్ల జనార్ధన్, ఎండీ ఉస్మాన్, మిట్టపల్లి శ్రీనివాస్, బండ రవి, బండ సత్యనారాయణ, కొక్కుల బుచ్చిరాములును అరెస్ట్ చేశారు. ఆ సమయంలో వారి దగ్గరున్న 82 వేల 500 రూపాయల నగదుతో పాటు 9 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఐపీఎల్ బెట్టింగ్ ముఠాకు నేతృత్వం వహిస్తున్న ముత్తయ్య శంకర్ పై గతంలో కూడా ఐపీఎల్ బెట్టింగ్ కేసులున్నట్లు పోలీసులు తెలిపారు.