ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టీఆర్ఎస్ నేత కిడ్నాప్... మావోయిస్టుల పనేనా...?

|
Google Oneindia TeluguNews

భద్రాద్రి- కొత్త గూడేం జిల్లా కొత్తూరు జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నేత ఎన్ శ్రీనివాసరావు కిడ్నాప్ అయ్యాడు.అయితే చత్తీస్‌గఢ్ నుండి వచ్చిన మావోయిస్ట్‌లు ఈ కిడ్నాప్‌కు పాల్పడినట్టు జిల్లా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు దీంతో మావోయిస్టులు తీసుకెళ్లిన టీఆర్ఎస్ నేతకు తిరిగి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు జిల్లా ఎస్పీ తెలిపారు.

కాగా సోమవారం అర్థరాత్రీ ఇంట్లో ఉన్న శ్రీనివాస రావును 15 మంది వరకు ఉన్న గుర్తు తెలియని వ్యక్తులు, తుపాకులు, కర్రలతో వచ్చి తీసుకెళ్లినట్టు శ్రీనివాస రావు భార్య దుర్గా మీడియాతో తెలిపింది. అయితే తన భర్తను తీసుకువెళ్లందని వేడుకున్న వినకుండా తనతోపాటు తన కుమారున్ని కొట్టిన వారు తన భర్తను సైతం కొట్టుకుంటూ బయటకు తీసుకు వచ్చారని చెప్పింది.

 TRS leader has been kidnapped by suspected Maoists

ఇక వారిని అడ్డుకునేందుకు ప్రయత్నాల చేసినప్పటికి తనపై తుపాకి ఎక్కుపెట్టారని, దీంతో ఇంటి నుండి బయటకు రాకుండా చేశారని తెలిపింది. దీంతో సుమారు 200 మంది వరకు ప్రజలతో పాటు శ్రీనివాస రావు కుటుంభ సభ్యులు ఆయన్ను వెతుక్కుంటూ చత్తీస్‌గఢ్‌కు వెళ్లారు. ఈ నేపథ్యంలో తన భర్తకు ఎలాంటీ హాని కల్గించకుండా వదిలిపెట్టాలని ఆమే కోరింది. మరోవైపు ఈ సంఘటనపై ఎలాంటీ పిర్యాధు అందలేదని పోలీసులు తెలిపారు.

English summary
Telangana Rashtra Samithi (TRS) leader has been "taken away" by suspected Maoists from his house in Bhadradri-Kothagudem district to the neighbouring Chhattisgarh, police said Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X