డబ్బు సంపాదనకు నిత్యపెళ్లికొడుకు... చివరకు ఎమయ్యాడు...?
బ్రతికేందుకు ఒక్కోక్కరిది ఓక్కో స్టైల్, కొందరు కష్టపడి పనిచేస్తూ డబ్బలు సంపాదిస్తుంటే మరి కొందరు అక్రమ సంపాదను అలవాటు పడి జీవితాన్ని కొనసాగిస్తారు. మరి కొందరు డబ్బు సంపాదనకు నిత్యం అబద్దాలు అడుతూ,ఇతరులను మోసాలు చేస్తూ కాలం వెళ్లదీస్తుంటారు..ఇలా చేసే వారికి కాలం కలిసి వస్తే జీవీతం సాగిపోతుంది లేదంటే కటకటలాపాలవుతారు. తాజా అమ్మాయిలను మోసం చేస్తూ డబ్బులు సంపాదించే సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది.
డబ్బు సంపాదనకు అమ్మాయిల ట్రాప్
డబ్బు సంపాదించేందుకు గుంటూరు జిల్లాకు చెందిన ప్రవీణ్ అనే పెళ్లిళ్లను మార్గంగా ఎంచుకున్నాడు. ఈనేపథ్యంలోనే గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన ప్రవీణ్ ముగ్గురిని పెళ్లి చేసుకుని మోసం చేశాడు. కాగా ప్రవీణ్ భద్రాద్రి కోత్తగూడెం జిల్లా లోని లక్ష్మిదేవి పల్లేలో ఉంటూ ఓ వాటర్ ప్యూరిఫై కంపనీలో డిస్ట్రిబ్యూటర్గా పని చేస్తున్నాడు. అయితే అదే కంపనీలో పని చేసే రాజేశ్వరితో స్నేహంగా నటించి తనకు ఎవరు లేరని నమ్మబలికాడు. అనంతరం ఆమేను రెండు నెలల క్రితం పెళ్లి చేసుకున్నాడు.
పెళ్లిల్ల అనంతరం డబ్బు తీసుకోవడమే లక్ష్యం
అనంతరం ప్రవీణ్ విశ్వరూపాన్ని చూపించాడు. రాజెశ్వరి వద్ద ఉన్న బంగారాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టి రెండు లక్షల రుపాయాల అప్పు తీసుకున్నాడు. అనంతరం ఆమే వద్ద ఉన్న 80 వేల రుపాయల నగదును కూడ తీసుకున్నాడు. ఇక విషయం తెలిసిన ప్రవీణ్ కుటుంభ సభ్యులు నేరుగా అతనుంటున్న ఇంటికి చేరుకుని భార్యను నిలదీశారు. తన కోడుకును పెళ్లి ఎందుకు చేసుకున్నావని ప్రశ్నించారు. ప్రవీణ్కు రెండు పెళ్లిల్లు కూడ అయ్యాయని తెలిపారు.
Recommended Video
ప్రవీణ్ లీలలపై ఎస్పీకి పిర్యాధు
దీంతో ఖంగుతిన్న రాజేశ్వర్ ప్రవీణ్ సంభందించిన కంప్యూటర్ను ఓపెన్ చేసి చూసింది. అందులో అమ్మాయిల ఫోటోలు , పలు వీడీయోలు ఉన్నట్టు గుర్తించింది. కాగా నిందితుడు ప్రవీణ్ అమ్మాయిలను ట్రాప్లో పడేసి వారి వద్ద వారితో అసభ్యకరమైన ఫోటోలు దిగి వారిని బ్లాక్ మెయిల్ చేస్తూ ,వాటిని వీడియోల రూపంలో చిత్రికరించి డబ్బులు రాబడతాడని తెలిసింది. దీంతో రాజేశ్వరి స్థానిక మహిళ సంఘాలతో కలిసి జిల్లా ఎస్పికి పిర్యాధు చేసింది.