కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆమె పంట పండింది ... 4 క్యారెట్ల డైమండ్ దొరికింది .. గతంలోనూ ఇద్దరికి

|
Google Oneindia TeluguNews

కర్నూలు, అనంతపురం జిల్లాలలో వర్షాకాలంలో వజ్రాల కోసం వేట కొనసాగుతుంది . చాలా మంది పని గట్టుకుని వజ్రాల కోసం అన్వేషణ సాగిస్తారు. రోజంతా పొలంలోనే ఉండి తళతళ మెరిసే రాళ్ల కోసం, వజ్రాల కోసం వెదుకులాట సాగిస్తారు.తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. తాజాగా కర్నూలు జిల్లాలోని తుగ్గలి మండలం పగిడిరాయి వద్ద ఒక మహిళకు అదృష్టం వరించింది . వజ్రం దొరికింది .

వైఎస్సార్‌ ఆసరా పథకం ప్రారంభించిన సీఎం జగన్.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామన్న ఏపీ సీఎం వైఎస్సార్‌ ఆసరా పథకం ప్రారంభించిన సీఎం జగన్.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామన్న ఏపీ సీఎం

 పగిడిరాయిలో ఓ మహిళకు దొరికిన నాలుగు క్యారెట్ల వజ్రం

పగిడిరాయిలో ఓ మహిళకు దొరికిన నాలుగు క్యారెట్ల వజ్రం

పొలం పనులు చేసుకుంటున్న సమయంలో పగిడిరాయిలో ఓ మహిళకు నాలుగు క్యారెట్ల వజ్రం దొరికింది. ప్రతి సంవత్సరం తొలకరి వర్షాలు కురిసిన తరువాత అక్కడి వారికి వజ్రాలు దొరకడం, వజ్రాల కోసం వారు అన్వేషణ సాగించడం పరిపాటి. ఇదే క్రమంలో వ్యవసాయ పనులు చేస్తున్న మహిళకు వజ్రం లభించగా దానిని ఆమె గుత్తి లోని ఓ వజ్రాల వ్యాపారికి మూడున్నర లక్షల రూపాయలకు విక్రయించినట్లు గా తెలుస్తుంది.

 గతంలో గొర్రెల కాపరికి దొరికిన వజ్రం

గతంలో గొర్రెల కాపరికి దొరికిన వజ్రం


ఈసారి వర్షాకాలం ప్రారంభమైన నాటి నుండి ఇప్పటివరకు నాలుగు నెలల కాలంలో ముగ్గురికి వజ్రాలు దొరికాయని స్థానికంగా చర్చ జరుగుతోంది.
గతంలోనూ పగిడిరాయి, బొల్లవానిపల్లె పొలాల్లో ఇద్దరికీ రెండు వజ్రాలు లభ్యమయ్యాయి. బొల్లవాని పల్లె గొర్రెల కాపరికి వజ్రం దొరికింది. ఆ వజ్రాన్ని ఆ గొర్రెల కాపరి రూ. 13 లక్షల 50 వేలు, ఐదు తులాల బంగారానికి ఓ వ్యాపారికి అమ్మాడు. ఇక ఆ వజ్రం విలువ సుమారు 60 లక్షలు ఉంటుందని అప్పట్లో పెద్ద చర్చే జరిగింది .

వ్యవసాయ కూలీకి కూడా దొరికిన వజ్రం .. ఆ జిల్లాలపై వజ్రాల వ్యాపారుల కళ్ళు

వ్యవసాయ కూలీకి కూడా దొరికిన వజ్రం .. ఆ జిల్లాలపై వజ్రాల వ్యాపారుల కళ్ళు

అలాగే పగిడిరాయిలో వ్యవసాయ కూలీకి కూడా ఒక వజ్రం దొరికినట్టు అప్పట్లో వెలుగులోకి వచ్చింది . ఇక అతని వద్ద నుండి రూ. 1.50 లక్షలకు జొన్నగిరి వ్యాపారి ఆ వజ్రాన్ని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
అత్యంత విలువైన వజ్రాలను అతి తక్కువ ధరకు కొనుగోలు చేస్తూ అక్రమార్కులు ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇక వజ్రాల వ్యాపారులు ఈ సీజన్ లో కర్నూలు , అనంతపురం జిల్లాలలో తిష్ట వేసి మరీ వజ్రాల కొనుగోళ్ళు చేస్తారు. ఇలా బహిరంగంగా వజ్రాలను కొనుగోలు చేస్తున్నా అధికారులు పట్టించుకోవటం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

English summary
A woman found a four-carat diamond in a cobblestone while working on a farm. Every year after the torrential rains, it is common to search for diamonds. It is learned that the women who were doing farm work got the diamond in the same order and sold it to a diamond dealer for three and a half lakh rupees.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X