కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తాగిన మైకంలో రెండు నెలల బిడ్డను నేలకేసి కొట్టి చంపిన తండ్రి

|
Google Oneindia TeluguNews

తాగిన మైకంలో ఓ కన్న తండ్రి పసికందు పట్ల కిరాతకంగా ప్రవర్తించాడు. అభం శుభం తెలియని చిన్నారిని విచక్షణ కోల్పోయిన ఆ తండ్రి నేలకేసి కొట్టి చంపేశాడు. కర్నూలు జిల్లా జూపాడు బంగ్లా లో జరిగిన ఈ ఘటనలో కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రే, కన్నబిడ్డ ఉసురు తీశాడు.

మల్కాపురం గ్రామానికి చెందిన బాలిరెడ్డి భార్య లక్ష్మి కేసీ కాలువ పక్కన ఉన్న బంగ్లా లో ఉంటూ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. 2 నెలల క్రితం వారికి ఒక పాప పుట్టింది. పాపకు దుర్గ అని పేరు పెట్టుకున్నారు. అల్లారుముద్దుగా పెంచుకున్న ఆ బిడ్డను, అభం శుభం ఎరుగని పసి దాన్ని తాగిన మైకంలో భార్యతో గొడవపడి, భార్యమీద కోపం బిడ్డ మీద చూపించాడు.
భార్య భర్తలు గొడవ పడుతున్న సమయంలో ఏడుస్తున్న బిడ్డను చూసి, బిడ్డ నోట్లో పాలసీసా కుక్కేసి తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు .

Drunken Father brutally killed two months girl child in kurnool district

అప్పటికి ఏడుపు ఆపకుంటే నేలకేసి కొట్టాడు. దీంతో ఆ బిడ్డ తలకు గాయమై ప్రాణాలు కోల్పోయింది. తాగిన మైకంలో, క్షణికావేశంలో విచక్షణ కోల్పోయి న తండ్రి తెల్లారి లేచి బిడ్డ ప్రాణాలు కోల్పోవడం చూసి ఆవేదన చెందినా బిడ్డని తిరిగి బ్రతికించుకోలేని స్థితిలో, గుట్టుచప్పుడు కాకుండా బిడ్డ మృతదేహాన్ని ఖననం చేయాలని ప్రయత్నించాడు. బాలిరెడ్డి కేసీ కాలువ పై మృతదేహాన్ని ఖననం చేయడానికి తీసుకొని వెళుతుండగా ఈ విషయం తెలిసిన పోలీసులు బాలి రెడ్డిని అరెస్టు చేశారు.

English summary
In a drunken stupor, A father behaved cruelly towards the baby. The father, who lost his sanity, hit the two months baby child to the ground and killed her. Father, who had to protect the child cruelly killed her.The incident took place at Jupadu Bangla in Kurnool district
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X