తాగిన మైకంలో రెండు నెలల బిడ్డను నేలకేసి కొట్టి చంపిన తండ్రి
తాగిన మైకంలో ఓ కన్న తండ్రి పసికందు పట్ల కిరాతకంగా ప్రవర్తించాడు. అభం శుభం తెలియని చిన్నారిని విచక్షణ కోల్పోయిన ఆ తండ్రి నేలకేసి కొట్టి చంపేశాడు. కర్నూలు జిల్లా జూపాడు బంగ్లా లో జరిగిన ఈ ఘటనలో కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రే, కన్నబిడ్డ ఉసురు తీశాడు.
మల్కాపురం
గ్రామానికి
చెందిన
బాలిరెడ్డి
భార్య
లక్ష్మి
కేసీ
కాలువ
పక్కన
ఉన్న
బంగ్లా
లో
ఉంటూ
కూలి
పనులు
చేసుకుంటూ
జీవనం
సాగిస్తున్నారు.
2
నెలల
క్రితం
వారికి
ఒక
పాప
పుట్టింది.
పాపకు
దుర్గ
అని
పేరు
పెట్టుకున్నారు.
అల్లారుముద్దుగా
పెంచుకున్న
ఆ
బిడ్డను,
అభం
శుభం
ఎరుగని
పసి
దాన్ని
తాగిన
మైకంలో
భార్యతో
గొడవపడి,
భార్యమీద
కోపం
బిడ్డ
మీద
చూపించాడు.
భార్య
భర్తలు
గొడవ
పడుతున్న
సమయంలో
ఏడుస్తున్న
బిడ్డను
చూసి,
బిడ్డ
నోట్లో
పాలసీసా
కుక్కేసి
తీవ్ర
అసహనం
వ్యక్తం
చేశాడు
.
అప్పటికి ఏడుపు ఆపకుంటే నేలకేసి కొట్టాడు. దీంతో ఆ బిడ్డ తలకు గాయమై ప్రాణాలు కోల్పోయింది. తాగిన మైకంలో, క్షణికావేశంలో విచక్షణ కోల్పోయి న తండ్రి తెల్లారి లేచి బిడ్డ ప్రాణాలు కోల్పోవడం చూసి ఆవేదన చెందినా బిడ్డని తిరిగి బ్రతికించుకోలేని స్థితిలో, గుట్టుచప్పుడు కాకుండా బిడ్డ మృతదేహాన్ని ఖననం చేయాలని ప్రయత్నించాడు. బాలిరెడ్డి కేసీ కాలువ పై మృతదేహాన్ని ఖననం చేయడానికి తీసుకొని వెళుతుండగా ఈ విషయం తెలిసిన పోలీసులు బాలి రెడ్డిని అరెస్టు చేశారు.