జనసేన కవాతుకు వెళ్లి వస్తూ ప్రమాదం : నలుగురు కార్యకర్తల మృత్యువాత..
రోడ్డు ప్రమాదంలో జనసేన కార్యక్తలు నలుగురు మృతి చెందారు. ఈ ఘటన ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాన తో పాటుగా పార్టీ నేతలను కలిచివేస్తోంది. అనంతపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాన్ కవాతు నిర్వహించారు. ఇందులో పాల్గొనేందుకు వెళ్లిన కర్నూలు జిల్లా కు నలుగురు కార్యకర్తలు కారులో తిరిగి స్వస్థలానికి తిరిగి వస్తుందగా ప్రమాదం జరి గింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. కారు డ్రైవర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన పై జనసేన అధినేత దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. వారి మృతి పై సంతాపం వ్యక్తం చేసారు.
కర్నూలు జిల్లా డోన్ సమీపంలో జనసేన కవాతు వెళ్లి వస్తున్న వెల్దుర్తి మండలం గోవర్దన గిరికి చెందిన ముగ్గురు జనసేన కార్యకర్తలు..ధర్మవరం గ్రామానికి చెందిన మరొక కార్యకర్త మృతి చెందారు. వీరు అనంతపురం లో జనసేన అధినేత నిర్వ హించిన కవాతు కోసం అక్కడికి వెళ్లి..కవాతులో పాల్గొన్నారు. తిరుగు ప్రయాణంలో వారు ప్రయాణిస్తున్న కారు డోన్ దగ్గర మలుపు తిరుగుతుండగా హైదరాబాద్ నుండి కొచ్చి వెళ్తున్న ప్రవేటు బస్సు వేగంగా వచ్చి ఢీకొంది. కారు నుజ్జు నుజ్జు అయింది.
ప్రమాదంలో నలుగురూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కాగా, కారు డ్రైవర్ మల్లిఖార్డున తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా, మరణించిన వారులో గోవర్ధన గిరికి చెందిన హనుమన్న, దాసరి మౌలాలి, మాల మధు ఉన్నారు. అదే జిల్లా ధర్మవరం గ్రామానికి చెందిన మధు సైతం మృత్యువాత పడ్డారు. ఈ ప్రమాదం విషయం తెలియగానే జనసేన నేతల్లో విషాదం అలముకొంది. కార్యకర్తలు పార్టీ కార్యక్రమంలో పాల్గొని రోడ్డు ప్రమాదంలో మరణించటం తో వారంతా దిగ్బ్రాంతికి గురయ్యారు.