కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీలో ఇద్దరు బాలికలపై అత్యాచార యత్న ఘటనలు .. చిత్తూరు,కర్నూలులో దారుణాలు

|
Google Oneindia TeluguNews

దేశంలో మహిళలపై దాడులు, బాలికలపై అత్యాచారాలు ఆపాలని పెద్ద ఎత్తున ఉద్యమాలకు దిగుతున్నా , బాలిక సంరక్షణ చట్టాలను కఠినంగా అమలు చేస్తున్నా నేరాలు తగ్గటం లేదు. బాలికలపై అత్యాచార ఘటనలు నిత్యకృత్యంగా మారాయి. ఇక ఈ నేపథ్యంలో తాజాగా చిత్తూరు జిల్లాలో జరిగిన ఒక దారుణం ఒక మైనర్ బాలుడిని జువైనల్ హోమ్ కు పంపించేలా చేసింది. కర్నూలు జిల్లాలో జరిగిన మరో దారుణంలో బాలిక కేకలు వెయ్యటంతో అత్యాచార యత్నం చేసిన యువకుడు పారిపోయాడు.

బర్త్ డే పార్టీకి పిలిచి .. కేక్ లో మత్తుమందిచ్చి .. బాలికపై ముగ్గురు మైనర్ బాలురు గ్యాంగ్ రేప్బర్త్ డే పార్టీకి పిలిచి .. కేక్ లో మత్తుమందిచ్చి .. బాలికపై ముగ్గురు మైనర్ బాలురు గ్యాంగ్ రేప్

9వ తరగతి విద్యార్ధినిపై అత్యాచారయత్నం చేసిన బాలుడు

9వ తరగతి విద్యార్ధినిపై అత్యాచారయత్నం చేసిన బాలుడు

చిత్తూరు జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఓ మైనర్ బాలుడు 9వ తరగతి విద్యార్ధినిపై అత్యాచారయత్నం చేసిన ఘటన తాజాగా వెలుగు చూసింది. కరోనా నేపథ్యంలో ప్రస్తుతం స్కూల్స్ కొనసాగడం లేదు. అయినప్పటికీ తల్లిదండ్రులు ప్రత్యేక విజ్ఞప్తి చేస్తే పిల్లలను స్కూల్ అనుమతిస్తున్నారు ఉపాధ్యాయులు. ఈ క్రమంలో ప్రత్యేక తరగతుల కోసం పాఠశాలకు వెళ్లిన ఒక విద్యార్థినిపై అదే ప్రాంతానికి చెందిన ఒక బాలుడు అత్యాచార యత్నం చేశాడు.

 స్కూల్ ఆవరణలోనే దారుణం .. కేసు నమోదు చేసి జువైనల్ హోం కు పంపిన పోలీసులు

స్కూల్ ఆవరణలోనే దారుణం .. కేసు నమోదు చేసి జువైనల్ హోం కు పంపిన పోలీసులు

ఉదయం ఇంటి నుంచి స్కూలుకు వెళ్లిన విద్యార్థిని, మధ్యాహ్నం అయిన ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆమెను వెతుక్కుంటూ పాఠశాలకు వెళ్లిన తల్లిదండ్రులు అక్కడ జరుగుతున్నది చూసి షాక్ అయ్యారు. స్కూల్ లో ఎవరూ లేని సమయం చూసి బాలుడు బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడుతూ కనిపించగా బాలుడి పట్టుకొని పోలీసులకు అప్పగించి బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దీంతో అత్యాచారయత్నానికి పాల్పడింది మైనర్ బాలుడు కావడంతో కేసు నమోదు చేసిన పోలీసులు జువైనల్ హోంకు తరలించారని సమాచారం .

 బహిర్భూమికి వెళ్లి వస్తున్న మరో బాలికపై యువకుడి అత్యాచార యత్నం .. కేసు నమోదు

బహిర్భూమికి వెళ్లి వస్తున్న మరో బాలికపై యువకుడి అత్యాచార యత్నం .. కేసు నమోదు

కర్నూలు జిల్లాలోని బేతంచెర్ల బలపాల పల్లె గ్రామంలో ఎనిమిదో తరగతి చదువుతున్న బాలికపై అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. బాలిక బహిర్భూమికి వెళ్లి వస్తుండగా పరమేశ్ అనే యువకుడు ఈ ఘటనకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. బాలిక కేకలు వేయడంతో సదరు యువకుడు అక్కడి నుండి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.

English summary
Strict enforcement of girl child care laws does not reduce crime. Incidents of rape against girls have become routine. In this context, a recent atrocity in Chittoor district led to the sending of a minor boy to a juvenile home. In another atrocity in Kurnool district, a young man who tried to rape a girl absconded.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X