మెదక్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కారు - ఆటో ఢీ: నలుగురు మృతి - నెత్తురోడిన మెదక్

|
Google Oneindia TeluguNews

మెదక్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జిల్లాలోని కొల్చారం మండలం కిష్టపూర్ వద్ద గురువారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి మెదక్ వైపు వేగంగా వస్తున్న కారు.. మెదక్ నుంచి కిష్టాపూర్ వెళ్తున్న ఆటోను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే చనిపోగా.. ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా ప్రమాద సమయంలో ఆటోలో 9 మంది ఉ‍న్నట్లు తెలుస్తుంది.

పవన్ మూడు పెళ్లిళ్లు: సోము వీర్రాజు స్పందన - జనసేనాని జోలికి రావొద్దని సీపీఐ నారాయణకు వార్నింగ్ పవన్ మూడు పెళ్లిళ్లు: సోము వీర్రాజు స్పందన - జనసేనాని జోలికి రావొద్దని సీపీఐ నారాయణకు వార్నింగ్

fetal road accident in medak district: car-auto rickshaw collided, several dead

కిష్టాపూర్ గ్రామానికి చెందిన నలుగురు చాకలి శ్రీవర్శిని (2), వరిగుంతం గ్రామానికి చెందిన ముత్యాల (46), అప్పాజిపల్లి గ్రామానికి చెందిన అతినగరం సుమలత(25) మ‌రొక‌రు అక్కడికక్కడే మృతిచెందారు. కిష్టాపూర్‌కు చెందిన తల్లీ కొడుకులు చాకలి ఇందిర, చాకలి వర్షిత్, వరిగుంతం గ్రామానికి చెందిన ముత్యాల స్వామి పరిస్థితి విషమంగా ఉంది. స‌మాచారం అందుకున్న పోలీసులు సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని విచార‌ణ చేప‌ట్టారు.

English summary
A car coming from Hyderabad towards Medak collided head-on with an auto going from Medak to Kishtapur on Thursday evening in Kolcharam area of Medak district. Four died on the spot and five were seriously injured in the accident. It is learned that there were 9 people in the car at the time of the accident.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X