నల్గొండలో 90 ఏళ్ల వృద్దురాలిపై అత్యాచారం,హత్య.. 22 ఏళ్ల యువకుడిపై అనుమానం..?
తెలంగాణలోని నల్గొండ జిల్లాలో దారుణం జరిగింది. 90 ఏళ్ల ఓ వృద్దురాలు ఆదివారం హత్యాచారానికి గురైంది. ఆ వృద్దురాలి కోడలు ఆమెకు 'టీ' ఇచ్చేందుకు గుడిసెలోకి వెళ్లగా విగతజీవిగా కనిపించింది. ఆమె శరీరంపై పంటి గాట్లు,గోళ్లతో రక్కిన గుర్తులు ఉండటాన్ని గమనించింది. నల్గొండ జిల్లాలోని హాలియా మండలం అనుముల గ్రామంలో ఈ ఘటన జరిగింది.
వృద్దురాలి హత్యాచారంపై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానికుడైన సత్రసాల శంకర్(22)పై అనుమానం వ్యక్తం చేశారు. శంకర్ తాగిన మైకంలో వృద్దురాలి గుడిసె వద్ద తచ్చాడుతుండటాన్ని గమనించినట్టు చెప్పారు.
కూలీ అయిన శంకర్ గతంలోనూ పలువురు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడన్న ఆరోపణలున్నాయి. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నట్టు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వృద్దురాలి మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం నల్గొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.