తొమ్మిదేళ్ల కాపురంలో ఆ చిచ్చు... ప్రియుడుతో కలిసి భర్తను చంపేసింది...!
అక్రమ సంబంధాల వ్యవహారం పట్టణాల్లోనే కాదు ఇప్పుడు పల్లేటూళ్లకు కూడ తాకాయి..తొమ్మిది సంవత్సరాల పాటు సంసార జీవితం గడిపిన మహిళ ప్రియుడితో కలిసి తన భర్తను హత్య చేసింది. అనంతరం ఆత్మహాత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. అయితే అప్పటికే మహళ అక్రమ సంబంధం గురించి తెలిసిన గ్రామస్తులు మహిళను పట్టుకుని చితకబాదిన సంఘటన నల్గోండ జిల్లాలో జరిగింది.
అక్రమ సంబంధం కోసం అఘాయిత్యం
నల్గోండ జిల్లా నకిరేకల్ మండలంలోని చిత్తలూరు అనే గ్రామంలో మమతా మల్లేశ్ కుటుంభం జీవిస్తుంది. వీరికి తొమ్మిది సంవత్సరాల క్రితం పెళ్లి అయింది. ఇద్దరు కుమార్తేలు, ఓ కుమారుడు కూడ ఉన్నాడు. అయితే ముగ్గురు పిల్లలున్న మమతా అదే గ్రామానికి చెందిన సోమయ్యతో అక్రమ సంబంధం కొనసాగిస్తోంది. అయితే తమ అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నా భర్తను మద్యం మత్తులో ఉంచి తొలగించుకోవలనే ఆలోచనకు పదును పెట్టారు.
మద్యం మత్తులో ఉన్న భర్తను ప్రియుడితో కలిసి హత్య
ఈనేపథ్యంలోనే ప్రియుడు సోమయ్యకు కూడ చెప్పింది. ఇద్దరు అనుకున్నట్టుగానే భర్త మల్లెశ్ ఓ సంతకు వెళ్లి మద్యం సేవించి రాత్రీ 10 గంటల సమయంలో ఇంటికి చేరాడు. అనంతరం మద్యం ఫుల్గా సేవించిన మల్లెష్ వాంతులు చేసుకున్నాడు. అనంతరం సోయి లేకుండా నిద్రపోయాడు. దీంతో అదను కోసం వేచి చూస్తున్న మమతు ప్రియుడు సోమయ్యను ఇంటికి పిలుపించుకుంది. ఇంట్లో ఉన్న పిల్లలు బయటకు రాకుండా బెడ్రూమ్కు గడియ పెట్టి సౌండ్ బయటకు బయటకు వినపడకుండా టీవీ సౌండ్ పెద్దగా పెట్టి మల్లెష్ పై దిండు పెట్టి ఒత్తి చంపివేశారు.
హత్య అనంతంర ఆత్మహత్యగా చిత్రీకరణ
అనంతరం పురుగుల మందును మల్లెశ్ నోట్లో పోయడంతోపాటు ఒంటిపై పోసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఇక తెల్లవార్లు నిద్రపోకుండా ఉన్న మమత ఉదయమే విషయాన్ని తన అత్తమామాలకు తెలిపింది. దీంతో తన కొడుకు మృతిపై అనుమానాలు వ్యక్తం చేసిన తల్లిదండ్రులతోపాటు అంతకు ముందే ఇద్దరి అక్రమ సంబంధంపై అనుమానాలు గ్రామస్థులకు అనుమానాలు ఉన్నాయి. దీంతో మమతపై గ్రామస్తులు దాడి చేయడంతో ఉన్న విషయాన్ని బయటకు వివరించింది మమత. దీనిపై పోలీసులు కేసును నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నారు.