ఫేస్బుక్ పరిచయం, ప్రేమ పెళ్లి.. మూడు నెలలకే కథ అడ్డం తిరిగింది
మిర్యాలగూడ : నీవే సర్వస్వం అన్నాడు. ప్రేమ మత్తులో ముంచేశాడు. ఫేస్బుక్ పరిచయాన్ని పెళ్లిపీటలెక్కించాడు. అంతవరకు బాగానే ఉన్నా.. ఆ తర్వాత ప్లేటు ఫిరాయించాడు. ఆనాడు నమ్మించి పెళ్లిచేసుకుని ఈనాడు మోసం చేయాలని చూడటంతో సదరు యువతి ఠాణా మెట్లెక్కింది.
ఏపీలోని విజయవాడ బెంజి సర్కిల్కు చెందిన ధారావత్ వాణికి.. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడకు చెందిన ధనావత్ విష్ణుతో పరిచయం ఏర్పడింది. రెండేళ్ల కిందట ఫేస్బుక్ ద్వారా ఏర్పడిన వీరి పరిచయం క్రమంగా ప్రేమకు దారితీసింది. దాంతో వీరిద్దరూ ఐదు నెలల కిందట పెళ్లి కూడా చేసుకున్నారు.
గర్ల్ఫ్రెండ్ మాట్లాడలేదని క్షణికావేశం.. కత్తితో పొడుచుకుని సూసైడ్ అటెంప్ట్
చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోవడంతో వాణి.. తన అక్క వాళ్లింట్లో ఉంటూ ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటోంది. ఆ క్రమంలో విష్ణుతో ఏర్పడిన పరిచయం పెళ్లికి దారి తీసింది. అదలావుంటే ఆమె నుంచి వివిధ సందర్భాల్లో దాదాపు 10 లక్షల రూపాయల వరకు తీసుకున్నాడట. ఇప్పుడేమో తల్లిదండ్రులు చూసిన మరో యువతిని పెళ్లి చేసుకునేందుకు రెడీ అయ్యాడు. వాణికి విషయం తెలియడంతో తనను మోసం చేశాడని ఆరోపిస్తూ చందంపేట పోలీసులను ఆశ్రయించింది.
వాణి, విష్ణు పెళ్లి అతడి కుటుంబ సభ్యులకు ఇష్టం లేదని తెలుస్తోంది. ఆ క్రమంలో విజయవాడలో ఉంటున్న విష్ణును.. గత రెండు నెలల కిందట అతడి బంధువులు కిడ్నాప్ చేసినట్లు అక్కడి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తన భర్తకు అనారోగ్యం కారణాలు సాకుగా చూపి వైద్యం చేపిస్తామంటూ విజయవాడ నుంచి తీసుకొచ్చారని వాణి ఆరోపిస్తోంది. అదే క్రమంలో మరో యువతితో పెళ్లి జరిపించారని వాపోయింది. అయితే ఆ పెళ్లికి ముందే తాను పోలీస్ స్టేషన్కు వచ్చినా.. పోలీసులు పట్టించుకోలేదన్నారు. చందంపేట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. అల్రెడీ విజయవాడలో కేసు ఉంది గదా అక్కడే తేల్చుకోవాలంటూ సూచించారట. వాణితో పాటు ఆమె వెంట వచ్చిన బంధువులకు సర్ధిచెప్పడంతో చేసేదేమీ లేక వారు విజయవాడ తిరిగి వెళ్లిపోయినట్లు సమాచారం.