హుజుర్నగర్ ఓటమికి బాధ్యత నాదే : ఉత్తమ్
ఇటివల జరిగిన హుజుర్నగర్ ఎన్నికల్లో ఓటమి భాద్యత తనదే అంటూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఉప ఎన్నికల్లో ఉత్తమ్ భార్య పద్మావతి రెడ్డి పోటి చేసిన విషయం తెలిసిందే.. కాగా ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి పద్మావతి రెడ్డిపై 43వేల ఓట్ల పైచిలుకు ఓట్ల మెజారీటితో గెలుపోందారు. దీంతో పార్టీ ఓటమి భవిష్యత్ ప్రణాళికలపై గాంధీభవన్లో సమీక్ష సమావేశం కొనసాగుతోంది.
కాగా హజుర్నగర్ ఉప ఎన్నికల్లో ఉత్తమ్ ఎంపీగా గెలుపోందడంతో మాజీ ఎమ్మెల్యే, మరియు ఉత్తమ్ భార్య అయిన పద్మావతి రెడ్డిని రంగంలోకి దింపారు. అయితే ఆమే అభ్యర్థిత్వాన్ని ఎంపీ రేవంత్ రెడ్డి నేరుగా వ్యతిరేకించారు. ఆయన మరో అభ్యర్థిని రంగంలోకి దింపారు. దీంతో పద్మావతి రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఇతర పార్టీ సీనియర్ నేతలు సైతం అంగీకరించడంతో చివరకు హైకమండ్ సైతం పద్మావతి రెడ్డి పేరును ఖారారు చేసింది. ఈనేపథ్యంలోనే పార్టీ ఓటమి పరిస్థితితో పాటు ప్రస్తుతం నెలకొన్న పార్టీ పరిణామాలపై పార్టీ ఇంచార్జీ ఆర్సీ కుంతియా సమక్షంలో సమావేశం అయ్యారు. సమావేశానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గం తోపాటు పలు ఇరత సీనియర్ నాయకులు సైతం హాజరయ్యారు.
ఇక సమావేశంలో పలువురు నేతలు వ్యవహరిస్తున్న తీరుపై కూడ చర్చించినట్టు తెలుస్తోంది. దీంతో సీనియర్ నేత హనుమంతరావు పార్టీలో క్రమశిక్షణ లోపించిందని వాపోయినట్టు తెలుస్తోంది. మరోవైపు మున్సిపల్ ఎన్నికలు, వాటి పరిణామాలపై పార్టీ నేతలు చర్చించారు. మున్సిపల్ ఎన్నికలను నవంబర్లోనే నిర్వహించేందు ఎన్నికల కమీషన్ కూడ కసరత్తు చేస్తోంది. దీంతో ఉప ఎన్నికల్లో చతికిలపడ్డ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లోనైనా తన సత్తా చాటేందుకు వ్యుహాలు రచిస్తోంది.