నల్గొండలో కోమటిరెడ్డి బ్రదర్స్ పనైపోయింది .. వారికి మతి భ్రమించిందన్న గుత్తా
తెలంగాణా రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ హవా కొనసాగుతుంది అని టీఆర్ఎస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు. నల్గొండ జిల్లా రాజకీయాల్లో కోమటిరెడ్డి సోదరుల శకం ముగిసిపోయిందని గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు . స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీదే విజయమని చెప్పారు.
తెలంగాణా
రాష్ట్రాన్ని
చినజీయర్
పాలిస్తున్నాడు
...
కంచె
అయిలయ్య
సంచలనం
విపరీతమైన ఓవర్ కాన్ఫిడెన్స్ తో , పిచ్చి పనులతో కోమటిరెడ్డి సోదరులు వారికి వారే ఓటమిని కొనితెచ్చుకుంటున్నారని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. వారికి మతి భ్రమించింది అని వ్యాఖ్య చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వారి అహంకారానికి చెంపపెట్టులాంటి తీర్పు వస్తుందని ఆయన చెప్పారు. భువనగిరి పార్లమెంటు స్థానంలో కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి లక్ష ఓట్ల తేడాతో ఘోరంగా ఓడిపోనున్నారని గుత్తా జోస్యం చెప్పారు. నల్గొండ జిల్లాలో ఉత్తమ్ కుమర్ రెడ్డి, జానారెడ్డిల పని అయిపోయిందని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భార్య లక్ష్మిని కాంగ్రెస్ పార్టీ నుండి ఎన్నికల బరిలోకి దింపారు. ఈ నేపధ్యంలోనే గుత్తా ఈ వ్యాఖ్యలు చేసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి ఖాయం అని కోమటిరెడ్డి సోదరులను ఉద్దేశించి పేర్కొన్నారు.