మామతో కోడలు వివాహేతర సంబంధం.. కొడుకికీ తెలియడంతో.. తండ్రిని, తర్వాత భార్యను..
కలికాలం అంటే ఇదే మరీ. మంచి చెడు కాదు.. వావి వరసలు కూడా లేకుండా పోతున్నాయి. వివాహేతర సంబంధాలతో కుటుంబాలు విచ్చిన్నమవుతున్నాయి. అయితే సూర్యాపేట జిల్లాలో ఓ మామా-కోడలు వావి వరస మరచిపోయారు. కూతురిలా చూసుకోవాల్సిన కోడలితో సంబంధం కొనసాగించాడు. విషయం తెలిసిన కుమారుడు ఊగిపోయాడు. కన్న తండ్రిని నరికి చంపేశాడు. జైలు నుంచి ఇటీవలే విడుదలై ఇంటికొచ్చారు. కానీ భార్యపై కోపం తగ్గలేదు.
పెన్ పహాడ్ మండలం జల్మలకుంట తండాకి చెందిన లునావత్ స్వామి-సరోజ దంపతులు. అయితే భర్త లేని సమయంలో మామతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. విషయం తెలిసిన కుమారుడు.. తండ్రిని కడతేర్చాడు. దీంతో అతనిని పోలీసులు అరెస్ట్ చేసి.. జైలుకు తరలించారు. ఇటీవలే ఆయన బెయిల్పై బయటకు వచ్చాడు. ఇంకేముంది గతంలో చేసిన తప్పు వెంటాడింది.
భార్యకు కూడా తగిన బుద్ది చెప్పాలనుకున్నాడు. ఆమెను గొడ్డలితో విచక్షణారహితంగా నరికాడు. దీంతో వివాహిత చనిపోయింది. స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు స్వామిని అరెస్ట్ చేశారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. కానీ ఈ వార్త స్థానికంగా కలకలం రేపింది. తప్పు చేసిన తండ్రి- భార్యను స్వామి కడతేర్చి కటకటలా పాలయ్యాడు.
మామ-కోడళ్లు వావి వరస మరచిపోవడంతో.. కుమారుడు బుద్ది చెప్పాలని భావించాడు. తండ్రిని తొలుత హతమార్చాడు. తర్వాత భార్యను మట్టుబెట్టి.. తన కోపాన్ని తీర్చుకున్నాడు. కానీ జైలు పాలయ్యాడు. కానీ తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. భార్య, తండ్రి కలిసి చేసిన తప్పుపై ప్రతీకారం తీర్చుకొని.. తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు.