నల్గొండ రియల్టర్ మర్డర్ కేసులో వీడిన మిస్టరీ.. భార్య అక్రమ సంబంధమే కొంప ముంచిందా?
నల్గొండ : భార్యాభర్తల మధ్య అనుబంధాలు సన్నగిల్లుతున్నాయి. ప్రేమానురాగాల చోట రాగద్వేషాలు పెరిగిపోతున్నాయి. కట్టుకున్న భర్తను భార్య.. అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్యను భర్త చంపేసుకుంటున్న రోజులొచ్చాయి. క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాలు ఆ కుటుంబాల్లో తీరని విషాదం మిగులుస్తున్నాయి. ఆ క్రమంలో నల్గొండ జిల్లాలో జరిగిన రియల్టర్ మర్డర్ వెనుక వాస్తవాలు చూస్తే కళ్లు బైర్లు కమ్ముతాయి.
నల్గొండ జిల్లా కేంద్రానికి చెందిన సోమ కేశవులు రియల్టర్ కమ్ బిల్డర్గా వ్యాపారం చేస్తున్నారు. ఇటీవల అతడిని అర్ధరాత్రి దారుణంగా హత్య చేశారు దుండగులు. తొలుత మిస్టరీగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు తీగ లాగితే డొంక కదిలింది. సోమ కేశవులు భార్య స్వాతి హస్తమున్నట్లు తేలింది. ఆమెతో సహా మొత్తం నలుగురి పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
10, 20కి చీరలు.. అవన్నీ ట్రిక్కులు.. మీ ప్రాణాలకు ప్రమాదం అక్కలు (స్పెషల్ స్టోరీ)
సోమ కేశవులు భార్యకు స్థానికంగా ఓ ఎలక్ట్రానిక్స్ షో రూమ్ నిర్వాహకుడు ప్రదీప్తో అక్రమ సంబంధమున్నట్లు నిర్ధారించారు. ఆ క్రమంలో భార్యాభర్తల మధ్య తరచు గొడవలు జరిగేవని తెలుస్తోంది. ప్రదీప్ తోనే కాదు పలువురితో ఆమెకు వివాహేతర సంబంధాలున్నట్లు సోమ కేశవులు దృష్టికి రాగా.. పలుమార్లు పద్దతి మార్చుకోవాలని వారించినట్లు సమాచారం. అయినా కూడా తీరు మారని స్వాతి ఏకంగా భర్తను మట్టుబెట్టేందుకు ప్లాన్ వేసింది.
హత్య పథకం గురించి ప్రియుడు ప్రదీప్కు వివరించడంతో అతడు స్థానికులైన శివ, శ్రీను సాయం తీసుకున్నాడు. దాంతో వారు సోమ కేశవులను దారుణంగా హత్య చేశారు. మర్డర్ తర్వాత నిందితులకు ఎంజాయ్ చేయాలంటూ స్వాతి లక్ష రూపాయలు ఇచ్చినట్లు తెలుస్తోంది.