ఇది కలికాలమే: భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నావ్యక్తిని.. ఐదుగురితో గ్యాంగ్ రేప్ చేయించాడా...?
నెల్లూరు : నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. అక్రమ సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతో ఓ యువకుడిపై ఐదుగురు సామూహిక అత్యాచారం చేశారు. ఈ దురాగతాన్ని వీడియో తీసిన నిందితులు విషయం ఎవరికైనా చెబితే దాన్ని బయటపెడతామని, చంపేస్తామని బెదిరించారు. షాక్ నుంచి తేరుకున్న యువకుడు పోలీసులకు కంప్లైంట్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
నెల్లూరు జిల్లా దొరవారిసత్రం మండలం ఉచ్చూరుకి చెందిన ఓ యువకుడు బుధవారం సూళ్లురుపేట యమహా షోరూం వద్ద స్నేహితుల కోసం వేచి చూస్తున్నాడు. ఇంతలో అక్కడికి వచ్చిన నాగరాజపురానికి చెందిన ఐదుగురు వ్యక్తులు అతనితో మాటలు కలిపారు. ఆ తర్వాత అతన్ని కిడ్నాప్ చేసి ఆటోలో ఎక్కించారు. మన్నారు పోలూరు శివారులోని చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి కర్రలతో దాడి చేశారు. అనంతరం ఐదుగురు నిందితులు యువకునిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
తండ్రికి ఎంత కష్టం: కోడలు కళ్లలో కారం చల్లింది.. కొడుకు చితక్కొట్టాడు.. అంతా పబ్లిక్గానే!
యువకుడిపై సామూహిక అత్యాచారానికి సంబంధించిన దృశ్యాలను నిందితులు సెల్ ఫోన్లో షూట్ చేశారు. ఈ విషయం ఎవరికైనా చెబితే వీడియో బయటపెడతామని, చంపేస్తామని బెదిరించారు. దీంతో తొలుత భయపడిన యువకుడు ఆ తర్వాత షాక్ నుంచి తేరుకుని సూళ్లురుపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదుచేసిన పోలీసులు నిందితులను నాగరాజపురానికి చెందిన దయాకర్, బాల చెన్నయ్య, వెంకటేశ్వర్లు, మహేష్, మస్తాన్గా గుర్తించారు. నిందితుల్లో ఒకరి భార్యతో బాధితుడికి అక్రమ సంబంధం ఉన్నట్లు అనుమానించి ప్రతీకారంగా ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.