విషాదం: సెల్ఫీ వీడియో తీసి సూసైడ్, ముగ్గురి వేధింపుల వల్లే..? విద్యార్థిని బలవన్మరణం..
ఏ సమస్యో కరెక్టుగా తెలియదు. కానీ ముగ్గురు యవకులు మాత్రం వేధించారని తెలిసింది. కానీ ఆ చిట్టి తల్లి వారితో పోరాడలేదు. పోరాడి గెలవలేను అని భావించిందో ఏమో.. కానీ తనువు చలించింది. ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అంతకుముందు ఉరేసుకోవడానికి ముందు సెల్ఫీ వీడియో కూడా తీసింది. ఆ సమయంలో కూడా యువతి కన్నీటి పర్యంతమైంది. చివరికీ ఆత్మహత్య చేసుకుంది.
నెల్లూరు భక్తవత్సల నగర్లో రమ్య అనే విద్యార్థిని పేరంట్స్తో కలిసి ఉంటోంది. ప్రైవేట్ డిగ్రీ కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతోంది. అయితే కాలేజీలో ముగ్గురు యువకులు వేధిస్తున్నారని కుటుంబసభ్యులు తెలిపారు. వారి టార్చర్ భరించలేక సూసైడ్ చేసుకుందని ప్యామిలీ మెంబర్స్ ఆరోపిస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా... వారు నిజ నిజాలను వెలికితీసే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు.
వేధింపులు భరించలేక యువతి ఉరేసుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఫ్యాన్కు ఉరేసుకొనే సమయంలో ఫోటోలు తీసి.. ముగ్గురు యువకులకు పంపించింది. తర్వాత సెల్ఫీ వీడియో కూడా తీసి సూసైడ్ చేసుకుంది. అందులో ఆమె ఏమో చెప్పాలనుకుంది. ఏం జరిగిందో స్పష్టత లేదు కానీ.. యువతి మాత్రం ఉరేసుకునే సమయంలో కూడా కన్నీరు పెట్టుకుంది. ఆ ఫుటేజీ వీడియోలో స్పష్టంగా కనిపించింది.