ప్రియురాలు మోసం చేసిందని .. ప్రాణాలు తీసుకున్న యువకుడు
ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రాణంతో సమానంగా ప్రేమించిన అమ్మాయి, తనను కాదని వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుందని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రియురాలు మోసగించడం తోనే కానీ నిర్ణయం తీసుకున్నట్లు గా సూసైడ్ నోట్ రాసిన ఆ యువకుడు ఆత్మహత్య చేసుకునే ముందు తాను ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నాను ఒక సెల్ఫీ వీడియో తీసి స్నేహితులకు పంపి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికంగా సంచలనం కలిగించిన ఈ ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది.
రైల్వే పోలీసులు అందించిన సమాచారం మేరకు.. నెల్లూరు దర్గామిట్ట ప్రాంతం ముత్యాలరెడ్డిపాళెంకు చెందిన రొక్కం సురేంద్ర (28) వెంకటగిరిలోని ఆంధ్రా బ్యాంకులో క్యాషియర్గా పనిచేస్తున్నాడు. ప్రేయసి చేసిన అన్యాయాన్ని తట్టుకోలేక తనువు చాలిస్తున్నానని, తనకు శిక్ష పడాలంటూ వీడియోలో లేఖలో పేర్కొన్న సురేంద్ర వెంకటాచలం, వేదాయపాళెం స్టేషన్ల మధ్య రైల్వే ట్రాక్పై రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సురేంద్ర మృతదేహాన్ని పరిశీలించి సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి , శవ పంచనామా నిర్వహించి దర్యాప్తు చేస్తున్నారు.
అక్రమ మద్యంపై నిఘా ఏది..? ఎన్నికల వేళ ఏపి ఎక్సైజ్ శాఖ వింత పోకడ..!!
ప్రేమించిన అమ్మాయి మోసం చేసినందువల్లే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడు సురేంద్ర . సురేంద్ర ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్న వెంటనే సెల్ఫీ వీడియోను చిత్రీకరించుకుని స్నేహితులకు పంపాడు. తాను చిన్నప్పటి నుంచి ప్రేమించిన అమ్మాయి తనతో ఎంతో సన్నిహితంగా ఉండి మరో అబ్బాయిని పెళ్లి చేసుకుందన్న బాధతోనే ఆత్మహత్యకు పాల్పడుతున్నానని ఆ వీడియోలో చెప్పాడు. స్నేహితుల వద్ద నుండి వీడియో తీసుకున్న రైల్వే పోలీసులు ఆత్మహత్యకు ప్రేమే కారణం అని నిర్ధారించారు.