నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అధికారులపై దాడులు చేస్తే బెయిలబుల్ కేసులా....? పవన్‌ కళ్యాణ్

|
Google Oneindia TeluguNews

విధి నిర్వహణలో మహిళ ఉద్యోగులను వేధింపులకు గురి చేసిన ఎమ్మెల్యేలపై నాన్‌బెయిబుల్ కేసులు పెట్టకుండా ప్రభుత్వం ఒత్తిడి తెచ్చిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఉద్యోగులపై ఇలాంటీ చర్యలు పాల్పడిన వారికి ప్రభుత్వం ఎలాంటీ సంకేతాలను ఇస్తుందని ఆయన ప్రశ్నించారు. సమాజంలో ఇలాంటీ సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని పవన్ కళ్యాన్ ప్రభుత్వాన్ని కోరారు. ఎమ్మెల్యేను పార్టీ తరుపున కనీసం మందలించే ప్రయత్నం కూడ చేయలేదని అన్నారు.

నెల్లూరు జిల్లా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శుక్రవారం రాత్రీ అనుచరులతో కలిసి ఇంటిపై దాడి చేశారని ఎంపీడివో సరళ అరోపించారు. దీంతో ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేసేందుకు ఆమే అర్థరాత్రి పోలీసు స్టేషన్‌కు వెళ్లారు. అయితే కేసును తీసుకునేందుకు ఎవరు అందుబాటులో లేకపోవడంతో ఆమే వెనుదిరిగారు. కాగా ఇదంతా మీడియాలో రావడంతో పెద్ద ఎత్తున దుమారం రేగింది. దీంతో దిగివచ్చిన పోలీసులు ఎమ్మెల్యే కోటంరెడ్డితో పాటు ఆయన అనుచరుడు శ్రీకాంత్ రెడ్డిపై పోలీసులు బెయిలబుల్ కేసుల క్రింద కేసును నమోదు చేశారు.

 pawan kalyan condemned in venkatachalam mpdo attack

ఎంపీడీవో వ్యవహారాన్ని పలు పార్టీలు తీవ్రంగా ఖండించారు. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్ష నేత చంద్రబాబు వైసీపీ నేతలపై మండిపడ్డారు. స్వంతపార్టీ నేతలు చేప్పిన అక్రమాలు అనుకూలంగా వ్యవహకరించకపోతే వారిపై దాడులు చేస్తారా అంటూ ఆయన ప్రశ్నించారు.

English summary
pawan kalyan condemned in venkatachalam mpdo attack
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X