PSLV - C45 ప్రయోగానికి సర్వం సిద్ధం.. కాసేపట్లో నింగిలోకి..!
శ్రీహరికోట : వరుస విజయాల భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో.. మరో ప్రయోగానికి సిద్ధమైంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోట షార్ స్పేస్ సెంటర్ నుంచి మరో అంతరిక్ష నౌకను పంపనుంది. సోమవారం (01.04.2019) ఉదయం 9 గంటల 27 నిమిషాలకు పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికిల్ - సీ 45 (PSLV - C45) నింగిలోకి దూసుకెళ్లనుంది.
పీఎస్ఎల్వీ వాహన నౌకను నింగిలోకి పంపే ప్రక్రియలో భాగంగా ఆదివారం (31.03.2019) నాడు ఉదయం 6 గంటల 27 నిమిషాలకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. 27 గంటల పాటు కౌంట్ డౌన్ ఏకధాటిగా సాగిన తర్వాత స్పేస్ లోకి ఎంటర్ కానుంది. 436 కిలోల బరువుండే DRDO కు చెందిన ఎలక్ట్రానిక్ ఇంటిలిజెన్స్ శాటిలైట్ ఇమిశాట్తోపాటు వివిధ దేశాలకు చెందిన 28 ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్లనుంది పీఎస్ఎల్వీ. అమెరికా, స్విట్జర్లాండ్, స్పెయిన్ దేశాలకు చెందిన ఉపగ్రహాలు అందులో ఉన్నాయి. అంతరిక్షంలోకి చేరుకున్న తర్వాత 3 వేర్వేరు కక్ష్యలోకి ఉపగ్రహాలను ప్రవేశపెట్టనుంది పీఎస్ఎల్వీ.