సీడ్ కంపెనీ కూడా.. మార్కెట్ ధర ఇవ్వకపోవడంతో రైతుల ఆందోళన..
రైతులను కొన్ని సీడ్ కంపెనీలు కూడా మోసం చేస్తున్నాయి. ఒప్పందం చేసుకొని.. తీరా సమయానికి హ్యాండ్ ఇస్తున్నాయి. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలంలో షేట్పల్లి గ్రామంలో రైతులను సీడ్ కంపెనీ చీట్ చేసింది. గ్రామానికి చెందిన కొందరు రైతులతో సీడ్ కంపెనీ పంటలు వేయించింది. పంట పండించిన తరువాత కంపెనీనే కొనేగోలు చేసే విధంగా రైతులతో సీడ్ కంపెనీ బై బ్యాక్ ఒప్పందం చేసుకుంది.
ఇప్పటివరకు ఓకే కానీ పంట పండించిన తరువాత మార్కెట్ ధరకు పంటలను కొనుగోలు చేయలేమని కంపెనీ చేతులెత్తేసింది. దీంతో తమతో చేసుకున్న ఒప్పందం ప్రకారం మార్కెట్ ధరకు కొనుగోలు చేయాలని రైతులు అంటున్నారు. తమకు విత్తనాలు ఇచ్చిన యజమాని ఇంటి ఎదుట రైతులు ధర్నా చేశారు. తమను న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పంట కోసం ఆరుగాలం శ్రమిస్తే.. చివరికీ ఇలా చేస్తున్నారని మండిపడ్డారు.
వ్యవసాయ చట్టాలపై రైతు నేతలు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. 3 వ్యవసాయ చట్టాలకు అన్యాయం జరుగుతుందని చెబుతున్నారు. ఢిల్లీ వేదికగా ఆందోళనకు దిగుతున్నారు. తమకు న్యాయం చేయమని రైతు నేతలు అంటోన్న కేంద్రం మాత్రం దిగిరావడం లేదు.