నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బంపర్ మెజార్టీతో ఎమ్మెల్సీగా కవిత విజయం .. కాంగ్రెస్, బీజేపీల డిపాజిట్లు గల్లంతు

|
Google Oneindia TeluguNews

నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గా సీఎం కెసిఆర్ కుమార్తె, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఘన విజయం సాధించారు. అనుకున్నట్లుగానే భారీ మెజార్టీతో మ్యాజిక్ ఫిగర్ ను దాటి కవిత తన విజయాన్ని నమోదు చేశారు. కవిత విజయంతో టీఆర్ఎస్ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు కనిపిస్తున్నాయి. భారీగా సంబరాలు జరుపుకుంటున్నారు .

సీఎం కేసీఆర్ కుమార్తె కవితకు దసరాకు గిఫ్ట్ ఇవ్వనున్నారా ? క్యాబినెట్ లో కవితకు స్థానం ? చర్చ షురూ !!సీఎం కేసీఆర్ కుమార్తె కవితకు దసరాకు గిఫ్ట్ ఇవ్వనున్నారా ? క్యాబినెట్ లో కవితకు స్థానం ? చర్చ షురూ !!

 823 ఓట్లకు గాను 728 ఓట్లు కవిత ఖాతాలో

823 ఓట్లకు గాను 728 ఓట్లు కవిత ఖాతాలో

నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కౌంటింగ్ లో భాగంగా నగరంలోని పాలిటెక్నిక్ కళాశాలలో ఓట్ల లెక్కింపు చేపట్టారు . 6 టేబుల్స్ పై రెండు రౌండ్ ల కౌంటింగ్ నిర్వహించారు.

మొత్తం 823 ఓట్లకు గాను 728 ఓట్లు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కవిత తన ఖాతాలో వేసుకున్నారు. బిజెపి 56 ఓట్లు, కాంగ్రెస్ 29 ఓట్లను నమోదు చేశాయి. ఇక 10 ఓట్లు చెల్లకుండా పోయాయి. కవిత విజయం సాధించడంతో టిఆర్ఎస్ పార్టీ శ్రేణుల సంబరాలు చేసుకుంటున్నాయి.

డిపాజిట్లు కోల్పోయిన బీజేపీ , కాంగ్రెస్

మొత్తం 823 ఓట్లు పోల్ కాగా మొదటి రౌండ్లో 600 ఓట్లను లెక్కించారు. మొదటి రౌండ్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కవితకు భారీ ఆధిక్యాన్ని ప్రదర్శించారు. రెండవ రౌండ్లోనూ కవితదే పైచేయిగా మారింది . మొత్తం 823 ఓట్లను 728 ఓట్ల రికార్డు మెజారిటీని సాధించి కవిత తన సత్తా చాటారు. మొదటినుంచి కవిత ఎన్నిక లాంఛనప్రాయమే అని అందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ కాంగ్రెస్, బిజెపిలు ఎన్నికల బరిలోకి దిగి చివరకు డిపాజిట్లు సైతం కోల్పోయి పరువు పోగొట్టుకున్నాయి.

Recommended Video

Nizamabad Local Body MLC Elections: TPCC President Uttam Kumar Reddy Slams CM KCR
 భారీ మెజార్టీతో పట్టు సాధించిన కవిత .. ఇక నుండి రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా

భారీ మెజార్టీతో పట్టు సాధించిన కవిత .. ఇక నుండి రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా

ఎమ్మెల్సీ ఎన్నికల్లో అత్యంత భారీ మెజారిటీ సాధించి నిజామాబాద్లో స్థానికంగా ఉన్న పట్టును నిరూపించుకోవాలి అనుకున్న కవిత అనుకున్నట్టుగానే భారీ విజయాన్ని నమోదు చేశారు. ఒక పక్క కవిత నేడు కౌంటింగ్ సందర్భంగా నాంపల్లిలోని యూసుఫియన్ దర్గాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చాదర్ ను సమర్పించారు. రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుండి కేంద్ర రాజకీయాల్లో కీలకంగా పనిచేసిన కవిత ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించనున్నారు. త్వరలోనే ఆమెకు మంత్రి పదవి కూడా వరిస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

English summary
kalvakuntla kavitha won with bumper majority in Nizamabad local body MLC By- elections . The counting of votes was carried out at the Polytechnic College in the city . Two rounds of counting were performed on 6 tables. TRS party candidate Kavitha bagged 728 votes out of a total of 823 votes. The BJP registered 56 votes and the Congress 29 votes. Another 10 votes were invalid. The TRS party ranks are celebrating the winning of kavitha as MLC
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X