నిజామాబాద్లో ఘోరం.. కారు డోర్స్ లాక్.. విగతజీవులుగా ఇద్దరు చిన్నారులు
నిజామాబాద్లో ఘోరం జరిగింది. కారు డోర్ లాక్ పడి ఇద్దరు చిన్నారులు చనిపోయారు. ముజాహిద్ నగర్లో జరిగిన ఈ ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది. మంగళవారం మధ్యాహ్నం నుంచి ఆచూకీ కనిపించకుండా పోయిన పదేళ్ల రియాజ్, ఐదేళ్ల బద్రుద్దీన్ చివరకు విగతజీవులుగా మారారు. ఇంటి సమీపంలో ఆడుకుంటూ పార్కింగ్ చేసిన ఓ కారులోకి ఎక్కారు. అయితే ఒక్కసారిగా కారు డోర్లు మూతపడ్డాయి. కారు అద్దాలు అప్పటికే మూసి ఉండటంతో ఊపిరి అందక మృత్యువాత పడ్డట్లు తెలుస్తోంది.
అన్నాదమ్ముళ్లకు జైలు శిక్ష.. అక్క పెట్టిన కేసు.. ఆ కోర్టు మరో సంచలన తీర్పు..!
పిల్లల జాడ కనిపించకుండా పోవడంతో మంగళవారం మధ్నాహ్నం నుంచి అర్ధరాత్రి వరకు తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులు వెతికారు. అయినా లాభం లేకుండా పోయింది. వారి ఆచూకీ తెలియక చాలా ప్రాంతాల్లో వెతికారు. చివరకు వారి ఇంటి సమీపంలో పక్కింటోళ్లు పార్కింగ్ చేసిన కారులో ఆ చిన్నారులు విగతజీవులుగా కన్పించారు. కారు డోర్లు లాక్ అయిపోవడంతో ఊపిరాడక చనిపోయి ఉంటారనరేది పోలీసుల వెర్షన్.
ఆ ఇద్దరు చిన్నారులు అక్కాచెల్లెళ్ల కొడుకులు కావడం గమనార్హం. ఒకేసారి వారిద్దరు ఇలా చనిపోవడంతో ఆ కుటుంబాల్లో విషాదఛాయలు అలముకున్నాయి. ఆ చిన్నారుల తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. అదలావుంటే ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఫ్యామిలీ మెంబర్స్. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.