ఎంపీకి పసుపుబోర్డు సెగలు... ఫోటోకు వైద్యపరీక్షలు నిర్వహించిన విద్యార్థులు
ఎంపీ అర్వింద్కు పసుపు సెగలు మరింత పెరిగాయి. ఆయన రాజీనామా చేయాలని కొద్ది రోజుల క్రితం రైతులు డిమాండ్ చేయగా..తాజాగా విద్యార్థులు రాజినామా డిమాండ్ను లేవనెత్తారు..ముఖ్యంగా పసుపు బోర్డు హామితో ఎంపీగా గెలిచిన అర్వింద్ ఇప్పుడు ఆ నినాదాన్ని పక్కన పెట్టడడంతో అంతకు మించిన విధానాన్ని కేంద్రం ప్రకటించనుందని చెప్పారు. దీంతో ఆయన ప్రకటనకు వ్యతిరేకిస్తూ... స్థానిక రైతులు పసుపు సాధన సమితిగా ఏర్పాడి పాదయాత్ర నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ కూడ చేశారు.
ఇక తాజాగా ఎంపీ అర్వింద్ తీసుకున్న నిర్ణయంతో స్థానిక రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా... ప్రస్థుతం ఆ డిమాండ్ విద్యార్థులు కూడ అందుకున్నారు. దీంతో ఆయన పసుపుబోర్డుపై నిర్ణయం మార్చుకోవడంతో నిజామాబాద్లోని తెలంగాణ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు ఆయన చిత్రపటానికి వైద్య చికిత్సలు నిర్వహించారు. ఎంపీగా గెలిచిన తర్వాత పసుపు బోర్డును పట్టించుకోవడం లేదని ఈ సంధర్భంగా విద్యార్థులు ఆరోపించారు. ఇప్పటికే పసుపు బోర్టును ఏర్పాటు చేయాలని లేదంటే ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశఆరు.