నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పోలీస్ స్టేషన్ లో యువకుడి వీరంగం .. ఎస్సైని, కానిస్టేబుల్ ని దుర్భాషలాడి రచ్చ

|
Google Oneindia TeluguNews

నిజామాబాద్ జిల్లా ఎడపల్లి పోలీస్ స్టేషన్ లో ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. గంట పాటు నానా హంగామా చేశాడు. ఓ యువకునిపై దాడి చేసిన కేసులో పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చినందుకు పోలీసులనే నానా దుర్భాషలాడాడు. చంపుతా అని బెదిరించారు . మాజీ సర్పంచ్ కొడుకుని నన్ను పోలీస్ స్టేషన్ కు తీసుకొస్తారా అంటూ ఎస్.ఐ. పైనే వీరంగం వేశాడు .

ఒక ఘర్షణ విషయంలో పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చిన ఎడపల్లి మాజీ సర్పంచ్ శంకర్ నాయుడు కుమారుడు రాజీవ్ నాయుడు అలియాస్ చంటి ఓ కానిస్టేబుల్ ను చంపుతానని బెదిరించడంతో పాటు ఎస్.ఐ. రూంలో కుర్చీలను నెంబర్ ప్లేట్ ధ్వంసం చేశాడు. పోలీసులు సదరు యువకునికి నచ్చ చెప్పే ప్రయత్నం చేసినా తాగిన మత్తులో పోలీసులకు వార్నింగ్ ఇచ్చాడు. నానా హంగామా సృష్టించాడు .ఫుల్లుగా మద్యం మత్తులో ఉన్న రాజీవ్ నాయుడు గ్రామానికి చెందిన కట్కం శంకర్ అనే వ్యక్తితో గొడవ పడి బీరు సీసాతో దాడి చేశాడు. బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

 young man has made Nuis

రాజీవ్ ను పోలీస్ స్టేషన్ కు పిలిపించగా కానిస్టేబుల్ ను చంపుతానంటూ బెదిరించిన రాజీవ్.. ఎస్.ఐ. ఎల్లాగౌడ్ తోను అమర్యాదగా ప్రవర్తించాడు. తనపై చేసి వేస్తే సంగతి చూస్తా నంటూ బెదిరించాడు. స్టేషన్ లో నువ్వన్నా ఉండాలి , నేనైనా ఉండాలంటూ నానా హంగామా సృష్టించాడు. తాగిన మత్తులో వీరంగం సృష్టించిన రాజీవ్ తో విసిగిపోయిన పోలీసులు.. వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పరీక్షల నిమిత్తం బోధన్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. రాజీవ్ పై రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని పోలీసులు పేర్కొన్నారు .

English summary
A young man has made Nuisance at Edapally Police Station in Nizamabad district. He was abused the police for bringing him to the police station and Threatened the police to kill.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X